ETV Bharat / sports

T20 worldcup 2021: టీమ్​ఇండియా పది ఓవర్లకు 60/3

author img

By

Published : Oct 24, 2021, 8:35 PM IST

టీ20 ప్రపంచకప్​లో భాగంగా పాకిస్థాన్​తో జరుగుతున్న మ్యాచ్​లో టీమ్​ఇండియా బ్యాట్స్​మెన్​ చేతులెత్తేస్తున్నారు. పది ఓవర్లు పూర్తయ్యేసరికి భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ(26) ,పంత్​(19) ఉన్నారు.

panth
పంత్​

టీ20 ప్రపంచకప్​లో భాగంగా టీమ్​ఇండియా-పాకిస్థాన్​ మధ్య జరుగుతున్న మ్యాచ్​ ఆసక్తికరంగా సాగుతోంది. పాక్​ బౌలర్లు టీమ్​ఇండియా బ్యాటర్లపై విరుచుకుపడుతున్నారు. తొలి పది ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది టీమ్​ఇండియా.

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లుగా దిగిన రోహిత్​శర్మ(0), కేఎల్​ రాహుల్​(3).. తొలి రెండు ఓవర్లోనే షహీన్​ అఫ్రిది బౌలింగ్​లో వెనుదిరిగారు. ఐదో ఓవర్​లో సూర్యకుమార్​ యాదవ్​ హసన్​ అలీ బౌలింగ్​ షాట్​కు యత్నించి కీపర్​ రిజ్వాన్​ చేతికి క్యాచ్​ ఇచ్చి ఔట్​ అయ్యాడు. ఇక మూడో స్థానంలో వచ్చిన కోహ్లీ(26; 6x1, 4x1) జాగ్రత్తగా ఆడుతున్నాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(26), పంత్​(19; 4x2) ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.