ETV Bharat / sports

MS Dhoni: 'కూల్'​గా మాయ చేసిన మహేంద్రుడు!

author img

By

Published : Jul 7, 2021, 12:28 PM IST

కెప్టెన్​ కూల్​గా తనదైన నాయకత్వ పటిమతో టీమ్ఇండియాకు అద్భుత విజయాలు అందించాడు మహేంద్ర సింగ్ ధోనీ. 16 ఏళ్ల క్రికెట్​ కెరీర్​లో టీ20 ప్రపంచకప్​తో పాటు, వన్డే వరల్డ్​కప్​, ఛాంపియన్​షిప్​ ట్రోఫీ వంటి ఐసీసీ ట్రోఫీలను భారత ఖాతాలో చేర్చాడు. బుధవారం మహి పుట్టిన రోజు సందర్భంగా అతడి అత్యుత్తమ ఇన్నింగ్స్​లు మీ కోసం..

ms dhoni, former india cricketer
మహేంద్ర సింగ్ ధోనీ, టీమ్ఇండియా మాజీ కెప్టెన్

క్రికెట్​ ప్రపంచంలో కెప్టెన్​గా భారత జట్టును కొత్త పుంతలు తొక్కించాడు​ మహేంద్ర సింగ్​ ధోనీ. 16 ఏళ్ల క్రికెట్​ కెరీర్​లో కెప్టెన్​గా, బ్యాట్స్​మన్​గా, వికెట్​ కీపర్​గా జట్టుకు విశేష సేవలు అందించాడు. వన్డే క్రికెట్​ చరిత్రలోని ఉత్తమ ఫినిషర్లలో ధోనీ ఒకరు. పరాజయానికి చేరువలో ఉన్న జట్టును విజయతీరాలకు చేర్చే సామర్థ్యంతో ఎంతో ప్రసిద్ధి పొందాడు మహి. బుధవారం (జులై 7) ధోనీ పుట్టినరోజు సందర్భంగా వన్డే క్రికెట్​లో ధోనీ అత్యుత్తమ ఇన్నింగ్స్​ల గురించి తెలుసుకుందాం.

తొలి శతకం పాక్​పై..

Special article on the occasion of Mahendra Singh Dhoni's birthday
ధోనీతో విరాట్

అంతర్జాతీయ క్రికెట్​లో అరంగేట్రం తర్వాత మొదటి నాలుగు వన్డేల్లో పేలవ ప్రదర్శన చేశాడు ధోనీ. తర్వాత భారత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో 2005లో జరిగిన మ్యాచ్​లో మాత్రం విశ్వరూపం చూపించాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన ఆ మ్యాచ్​లో 123 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 148 పరుగులు సాధించాడు. ధోనీ అద్భుతమైన ఇన్నింగ్స్​తో టీమ్ఇండియా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 356 రన్స్​ చేసింది. ఆ మ్యాచ్​లో పాకిస్థాన్​పై 58 పరుగుల తేడాతో భారత్​ ఘనవిజయం సాధించింది.

ఇదీ చదవండి: 'ధోనీని చెన్నై ఎప్పటికీ వదులుకోదు.. అతడొక మహారాజు'

లంకపై విశ్వరూపం..

పాకిస్థాన్​పై 148 పరుగుల విజయవంతమైన ఇన్నింగ్స్​ తర్వాత అదే ఏడాది శ్రీలంకపై అద్భుత ఇన్నింగ్స్​ ఆడాడు ధోనీ. తొలుత బ్యాటింగ్​ చేసిన లంక జట్టు 299 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదన తొలి ఓవర్​లోనే సచిన్​ వికెట్ కోల్పోయింది టీమ్​ఇండియా.

మాస్టర్​ ఔట్​ అయిన ఆనందం కొంత సేపైనా శ్రీలంక ఆటగాళ్లలో నిలవలేదు. 3వ స్థానంలో బరిలో దిగిన ధోనీ.. ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. స్వీప్​ షాట్లు, డ్రైవ్​లతో లంక బౌలర్లను బెంబేలెత్తించాడు. 145 బంతుల్లో 183 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు ధోనీ. అంతర్జాతీయ క్రికెట్​లో అరంగేట్రం చేసిన తర్వాత ఆసియాలోని రెండు బలమైన జట్లపై అత్యధిక స్కోరు సాధించిన బ్యాట్స్​మన్​గా ఘనత వహించాడు.

Special article on the occasion of Mahendra Singh Dhoni's birthday
మహి

ఆఫ్రికా ఎలెవన్​పై 139 రన్స్..

2007లో ఆసియా ఎలెవన్​ వర్సెస్​ ఆఫ్రికా ఎలెవన్​ జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో కేవలం 97 బంతులు ఆడి 139 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు ధోనీ. 15 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగిపోయాడు. తొలుత బ్యాటింగ్​ చేసిన ఆసియా జట్టు నిర్ణీత ఓవర్లలో 332 పరుగులు సాధించింది. ఛేదనలో ఆఫ్రికా 7 వికెట్లు కోల్పోయి 318 పరుగులు చేసి 13 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.

ఐపీఎల్​-2010: 54 నాటౌట్ (పంజాబ్​పై)

ఐపీఎల్​-2010 ప్లేఆఫ్స్​లో చెన్నై సూపర్​కింగ్స్​, కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్​ 20 ఓవర్లలో ​3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సీఎస్కే రెండు బంతులు మిగిలుండగానే విజయాన్ని సొంతం చేసుకుంది.

చివరి ఓవర్​లో చెన్నై 16 రన్స్​ చేయాల్సి ఉంది. ఇర్ఫాన్​ పఠాన్​ బంతిని అందుకున్నాడు. మోర్కెల్​తో పాటు కెప్టెన్​ ధోనీ క్రీజ్​లో ఉన్నాడు. మొదటి బంతికి కవర్​ మీదుగా బౌండరీ సాధించాడు మహి. ఇర్ఫాన్​ పఠాన్​ ఒత్తిడిలో వేసిన తర్వాత రెండు బాల్స్​ను లాంగ్​ ఆన్​ దిశగా బౌండరీలు బాదాడు. నాలుగో బంతిని ఫినిషింగ్​ షాట్​గా సిక్సర్ కొట్టాడు. ఈ మ్యాచ్​లో ధోనీ 54 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. ధోనీ ఆడిన ఫినిషింగ్​ ఇన్నింగ్స్​ల్లో ఈ మ్యాచ్​ ఆల్​టైమ్​ ఫేవరెట్​గా ఉంటుంది.

ఇదీ చదవండి: MS Dhoni: అత్యుత్తమ సారథి.. రికార్డులకు 'వారధి' ధోనీ

వన్డే వరల్డ్​కప్​ విన్నింగ్​ షాట్..

2011 ఏప్రిల్​ 2.. భారత క్రికెట్​ అభిమానులు మర్చిపోలేని రోజు. 28 ఏళ్ల తర్వాత టీమ్​ఇండియా తిరిగి విశ్వవిజేతగా నిలిచిన క్షణం. 2011 ప్రపంచకప్​నకు ఆతిథ్యమిచ్చిన భారత్​.. లీగ్​ మ్యాచ్​ల నుంచే సత్తా చాటుకుంటూ వచ్చింది. తుదిపోరులో శ్రీలంకపై ఘనవిజయాన్ని సాధించి.. 1983 తర్వాత రెండోసారి ప్రపంచకప్​ను దక్కించుకుంది ధోనీసేన.

Special article on the occasion of Mahendra Singh Dhoni's birthday
ప్రపంచకప్ విన్నింగ్ షాట్

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 275 పరుగుల లక్ష్యాన్ని భారత్​కు నిర్దేశించింది. ఆదిలోనే సచిన్, సెహ్వాగ్​ ఔట్​ అవ్వడం వల్ల జట్టుపై మరింత ఒత్తిడి పెరిగింది. గౌతమ్​ గంభీర్​ 97 పరుగుల ఇన్నింగ్స్​ భారత​ గెలుపునకు సాయపడింది. గంభీర్​ ఔటైన తర్వాత బరిలో దిగిన కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీ 79 బంతుల్లో 91 పరుగులు(నాటౌట్​) చేసి టీమ్​ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. విజయానికి నాలుగు పరుగులు చేయాల్సిన క్రమంలో లాంగ్​ఆన్​ మీదుగా ధోనీ బాదిన సిక్సర్​ అతని కెరీర్​ ఉత్తమ ఫినిషింగ్​ షాట్​గా అభిమానులకు చిరస్మరణీయంగా గుర్తుండిపోయింది.

ఆస్ట్రేలియాపై 44 నాటౌట్..

అడిలైడ్​ వేదికగా 2012లో జరిగిన కామన్​వెల్త్​ బ్యాంక్​ సిరీస్​ నాలుగో మ్యాచ్​లో గౌతమ్​ గంభీర్​ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్​ టీమ్​ఇండియా విజయానికి బాటలు వేసింది. గంభీర్​ వెనుదిరిగిన తర్వాత బరిలో దిగిన రైనా, జడేజాలు వెంటవెంటనే ఔటయ్యారు. రవిచంద్రన్​ అశ్విన్​తో కలిసి క్రీజ్​లో ఉన్నాడు ఉన్నాడు​ ధోనీ. ఆ మ్యాచ్​ చివరి ఓవర్​లో భారత్ 12 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్​లో ఉన్న అశ్విన్​ సింగిల్​ తీసి ధోనీకి బ్యాటింగ్​ ఇద్దామనే ప్రణాళికతో ఉన్నాడు. తొలి బంతి డాట్​గా పోయింది. రెండో బంతికి రన్​ తీసి బ్యాటింగ్​ బాధ్యతను కెప్టెన్​ ధోనీకి అప్పగించాడు అశ్విన్. మూడో బంతికి సిక్సర్​ బాదాడు ధోనీ. ఆ తర్వాతి బంతి నోబాల్​ అవ్వడం వల్ల బైస్​తో పాటు మూడు పరుగులు లభించాయి. నాలుగో బంతికి మూడు రన్స్​ చేసి టీమ్ఇండియాకు విజయాన్ని అందిచాడు కెప్టెన్​ మహి.

ఇదీ చదవండి: India vs Sri Lanka: వీరు బరిలో దిగితే.. శతకాల మోతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.