ETV Bharat / sports

ఆ పర్యటనకు టీమ్​ఇండియా కోచ్​గా ద్రవిడ్!

author img

By

Published : May 11, 2021, 12:36 PM IST

rahul-dravid-likely-to-coach-team-india-in-sri-lanka
ఆ పర్యటనకు టీమ్​ఇండియా కోచ్​గా ద్రవిడ్!

జులైలో శ్రీలంకతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్​లో భారత జట్టు కోచ్​గా రాహుల్ ద్రవిడ్ వ్యవహరించే అవకాశముందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. సీనియర్​ ఓపెనర్ ధావన్​ జట్టు పగ్గాలు చేపట్టే అవకాశముందని తెలిపాయి.

శ్రీలంకతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్​కు క్రికెట్​ దిగ్గజం రాహుల్​ ద్రవిడ్​ కోచ్​గా వ్యవహరించనున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. సీనియర్​ బ్యాట్స్​మన్​ శిఖర్​ ధావన్​ జట్టును ముందుండి నడిపిస్తాడని పేర్కొన్నాయి.

ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ కోసం జూన్​ 2న ఇంగ్లాండ్​ వెళ్లనుంది కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు. జూన్​ 18-22 వరకు కివీస్​తో డబ్ల్యూటీసీ మ్యాచ్​ ఆడనుంది. తర్వాత ఆగస్ట్​ 4 నుంచి ఇంగ్లాండ్​తో టెస్ట్​ సిరీస్​లో పాల్గొననుంది టీమ్​ఇండియా. దీంతో జులైలో మ్యాచ్​లేమీ లేకపోవడం వల్ల శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్​ను ప్రకటించింది బీసీసీఐ.

కొవిడ్ నిబంధనల నేపథ్యంలో ఇంగ్లాండ్ నుంచి శ్రీలంకకు.. మళ్లీ అక్కడి నుంచి ఇంగ్లాండ్​కు భారత జట్టు ప్రయాణించడానికి వీలులేదు. దీంతో మరో టీమ్​ను శ్రీలంకకు పంపాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. రవి శాస్త్రి, కోహ్లీ ఇంగ్లాండ్​లో ఉంటే.. ద్రవిడ్​, ధావన్​ శ్రీలంకకు పంపించాలని బోర్డు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ​

ఇదీ చదవండి: 'సుశీల్ ఘటనతో డబ్ల్యూఎఫ్​ఐ ప్రతిష్ఠ దిగజారింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.