ETV Bharat / sports

WTC Final: న్యూడ్​గా కనిపించడంపై పూనమ్ పాండే మళ్లీ..!

author img

By

Published : Jun 20, 2021, 11:32 AM IST

Poonam Pandey on WTC Final between India and NZ
పూనమ్ పాండే

టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో భారత్​ గెలిస్తే, న్యూడ్​గా కనిపిస్తానని మళ్లీ చెప్పాలా అంటూ నటి పూనమ్ పాండే అడిగింది. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేసింది. ప్రస్తుతం సౌథాంప్టన్​ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఈ మ్యాచ్​ జరుగుతోంది.

టీమ్​ఇండియా వన్డే ప్రపంచకప్(ODI world cup)​ గెలిస్తే ఒంటిపై బట్టల్లేకుండా పోజులిస్తానని, క్రికెటర్లనూ అలానే కలుస్తానని షాకింగ్ వ్యాఖ్యలు చేసిన నటి, మోడల్ పూనమ్ పాండే(Poonam pandey) గతంలో వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం వరల్డ్ టెస్టు ఛాంపియన్​షిప్(World Test Championship)​ జరుగుతున్న దృష్ట్యా మరోసారి అదే విషయం గురించి మాట్లాడింది.

ఇటీవల పలువురికి నిత్యావసరాలు దానం చేసిన పూనమ్​పాండేను పలకరించిన మీడియా.. వరల్డ్​ టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్​​ గురించి అడిగింది. దీంతో "క్రికెట్ జరుగుతుందా? ఇండియా గెలిస్తే మళ్లీ నేను న్యూడ్​గా​ కనిపిస్తానని మీకు చెప్పాలా?. దీని గురించి నాకేం తెలియదు. ఇంటికెళ్లి ఈ కాంట్రవర్సీ గురించి ఆలోచిస్తాలే" అని పూనమ్ ఆ విషయాన్ని దాటవేసింది.

2011 వన్డేప్రపంచకప్​ సందర్భంగా ఇలానే షాకింగ్ వ్యాఖ్యలు చేసిన పూనమ్ పాండే.. మన జట్టు విజేతగా న్యూడ్​గా కనిపిస్తానని చెప్పింది. అప్పట్లో అది పెద్ద చర్చనీయాంశమైంది. గతేడాది ఈమె, సామ్ బాంబేను పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత చిన్నపాటి గొడవలు జరిగాయి. కానీ ప్రస్తుతం ఈ జంట బాగానే ఉంటున్నారు!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.