ETV Bharat / sports

Ind Vs Pak: భారత్​తో మ్యాచ్ అంటే నిద్రపట్టేది కాదు'

author img

By

Published : Dec 26, 2021, 2:54 PM IST

Pak vs India Shahid Afridi: తాను ఆడే రోజుల్లో టీమ్ఇండియాతో మ్యాచ్​ అంటే.. ముందు రోజు రాత్రి సరిగా నిద్రపట్టేది కాదని గుర్తుచేసుకున్నాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది. ఎప్పుడెప్పుడు మ్యాచ్ ఆరంభమవుతుందా అని తమ జట్టు ఆటగాళ్లంతా ఎదురుచూసేవాళ్లని చెప్పాడు.

షాహిద్​ అఫ్రిది, shahid Afridi
షాహిద్​ అఫ్రిది

Pak vs India Shahid Afridi: ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్​లో సూపర్‌-12 దశలో పాకిస్థాన్‌ తన తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియాను ఓడించింది. ఐసీసీ ప్రపంచకప్‌ల చరిత్రలో చిరకాల ప్రత్యర్థితో భారత్‌కు ఇదే తొలి ఓటమి. ఈ మ్యాచ్‌కు ముందు పాక్‌ పేసర్‌ షహీన్ అఫ్రిది ఒత్తిడికి గురయ్యాడని, దాంతో తనకు ఫోన్‌ చేశాడని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది పేర్కొన్నాడు. తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
"టీమ్‌ఇండియాతో తన తొలి గేమ్‌ ఆడకముందు షహీన్‌ నాకు వీడియోకాల్‌ చేసి ఒత్తిడికి గురవుతున్నట్లు చెప్పాడు. మేం సుమారు 12 నిమిషాలు మాట్లాడుకున్నాం. దాంతో.. దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. మైదానంలోకి వెళ్లి అత్యుత్తమ ప్రదర్శన చేయ్​. టీమ్‌ఇండియా వికెట్లు తీసి హీరో అవ్వు" అని అతడికి సూచించానని అఫ్రిది అన్నాడు.

ఇక తాను ఆడే రోజుల్లో టీమ్‌ఇండియాతో మ్యాచ్‌ అంటే.. ముందురోజు రాత్రి నిద్ర పట్టకపోయేదని కూడా గుర్తుచేసుకున్నాడు షాహిద్​. "నేను ఆడే రోజుల్లోనూ.. మా జట్టు ఆటగాళ్లు భారత్‌తో మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి అస్సలు నిద్రపోయేవాళ్లు కాదు. కొందరైతే ఎప్పుడెప్పుడు మ్యాచ్‌ ఆరంభమవుతుందా అని ఎదురుచూసేవాళ్లు. ఎందుకంటే ఎంతో మంది ప్రజలు తమ పనులను పక్కనపెట్టి మరీ భారత్​-పాక్​ మ్యాచ్‌లను తిలకించేవారు" అని అఫ్రిది చెప్పుకొచ్చాడు.


ఇదీ చూడండి: అతడే బెస్ట్ కెప్టెన్.. బాబర్ కాదు: షాహీన్ కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.