ETV Bharat / sports

ఐపీఎల్ జట్లకు కైఫ్, యూసఫ్ బంపర్ ఆఫర్.. ఏంటంటే?

author img

By

Published : Jan 21, 2022, 2:49 PM IST

Kaif Yusuf Pathan
Kaif Yusuf Pathan

Kaif Yusuf Pathan: టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు మహ్మద్ కైఫ్, యూసఫ్ పఠాన్ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. మెగావేలంలో తమను కూడా తీసుకోవాలంటూ కోరారు. అసలు ఏం జరిగిందంటే!

Kaif Yusuf Pathan: అప్పట్లో యూసఫ్ పఠాన్, మహ్మద్ కైఫ్ టీమ్ఇండియా విజయాల్లో కీలకపాత్ర పోషించారు. ఆల్​రౌండర్​గా యూసఫ్, బ్యాటింగ్, అద్భుత ఫీల్టింగ్​తో కైఫ్ ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నారు. అయితే వీరికి సరైన అవకాశాలు లభించకపోవడం వల్ల అంతర్జాతీయ క్రికెట్​కు తొందరగానే రిటైర్మెంట్ ప్రకటించారు. తాజాగా జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ లీగ్​లో వీరిద్దరూ ఇండియా మహారాజా జట్టు తరఫున ఆడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు.

లెజెండ్స్​ లీగ్​లో భాగంగా ఆసియా ఎలెవన్​తో జరిగిన మ్యాచ్​లో ఇండియా మహారాజా తరఫున ఆడుతున్న యుసఫ్ పఠాన్.. చెలరేగి బ్యాటింగ్ చేశాడు. 40 బంతుల్లోనే 80 పరుగులు బాదాడు. అనంతరం కైఫ్ (41*), ఇర్ఫాన్ పఠాన్ (21*) నాటౌట్​గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ విజయం అనంతరం కైఫ్.. ట్విట్టర్​లో ఓ ఫన్నీ పోస్ట్ షేర్ చేశాడు. "ఐపీఎల్ జట్లు మేము రెడీ. మెగావేలానికి ముందు ఓ సందేశం పంపండి. ఒకరిని తీసుకుంటే మరొకరు ఉచితం" అంటూ యూసఫ్​తో ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. ఇది కాస్తా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ మెసేజ్ మీరూ చూసేయండి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: టీమ్ఇండియా మాజీ క్రికెటర్​ హర్భజన్​కు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.