ETV Bharat / sports

'కోహ్లీ కెప్టెన్సీపై కాదు.. దానిపై దృష్టి పెడదాం'

author img

By

Published : Sep 14, 2021, 12:33 PM IST

Updated : Sep 14, 2021, 1:15 PM IST

kohli
కోహ్లీ

భారత క్రికెట్​ జట్టు సారథి(Kohli Captaincy) మార్పుపై వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు బీసీసీఐ వైస్​ ప్రెసిడెంట్​ రాజీవ్​ శుక్లా(rajiv shukla bcci vice president). భవిష్యత్ గురించి జోస్యం చెప్పుకోకుండా టీ20 ప్రపంచకప్ పై దృష్టి పెడదాం అని అన్నారు.

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నాయకత్వ(Kohli Captaincy) మార్పుపై వస్తున్న వార్తలను బీసీసీఐ వైస్​ ప్రెసిడెంట్​ రాజీవ్ శుక్లా(rajiv shukla bcci vice president) కొట్టిపారేశారు. అక్టోబర్​లో నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్‌(ICC T20 Worldcup 2021) ముగిసిన వెంటనే విరాట్(టెస్ట్​)​, రోహిత్(వన్డే, టీ20)​ కెప్టెన్సీని పంచుకుంటారని వస్తున్న వార్తలన్నీ పుకార్లే అని అన్నారు.

"ఈ వార్తలో నిజం లేదు. భవిష్యత్ గురించి జోస్యాలు చెప్పుకోకుండా టీ20 ప్రపంచకప్ పై దృష్టి పెడదాం. ద్వంద్వ కెప్టెన్సీ గురించి ఎలాంటి చర్చలు జరగలేదు."

-రాజీవ్​ శుక్లా, బీసీసీఐ వైస్​ ప్రెసిడెంట్​.

అంతకుముందు ఈ వార్తలపై స్పందించిన బీసీసీఐ కోశాధికారి అరుణ్​ ధూమాల్​(Arun Dhumal BCCI) కూడా విరాట్ కెప్టెన్సీలో మార్పులు ఉండవని స్పష్టం చేశారు.

యూఏఈ వేదికగా అక్టోబర్‌ 17 నుంచి టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ఈ నెల 19 నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2021)లోని మిగతా మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఆ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత టీ20 ప్రపంచకప్‌ ప్రారంభమవుతుంది. ఇటీవలే టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021)​ కోసం టీమ్​ఇండియా స్క్వాడ్​ను ప్రకటించింది బీసీసీఐ.

ఇదీ చూడండి: Kohli Captaincy: కోహ్లీ కెప్టెన్సీలో మార్పు.. బీసీసీఐ క్లారిటీ

Last Updated :Sep 14, 2021, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.