కోహ్లీకి దాదా షోకాజ్​ నోటీసులు పంపించాలనుకున్నాడా?

author img

By

Published : Jan 20, 2022, 9:55 PM IST

Kohli Ganguly controvesy

Ganguly Kohli Controversy: బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కోహ్లీ మధ్య విభేదాలు వచ్చాయని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి గొడవ గురించి ఓ విషయం తెలిసింది. కెప్టెన్సీ విషయంలో తనపై చేసిన వ్యాఖ్యలకు కోహ్లీకి షోకాజ్​ నోటీసులు పంపించాలని దాదా అనుకున్నాడట! కానీ వివాదం పెద్దది అవ్వకుండా చూసేందుకు బీసీసీఐ సభ్యులందరూ కలిసి దాదా.. తన ఆలోచనను విరమించుకునేలా చేశారని తెలిసింది.

Ganguly Kohli Controversy: టీమ్​ఇండియా మాజీ సారథి కోహ్లీ-బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా వీరిద్దరి వివాదం గురించి మరో విషయం బయటకు వచ్చింది. కోహ్లీ తనపై చేసిన వ్యాఖ్యలకు దాదా షోకాజ్​ నోటీసులు జారీ చేయాలని భావించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని క్రికెట్​ వర్గానికి సంబంధించిన ఓ ప్రతినిధి తెలిపారు.

గతేడాది సెప్టెంబరులో టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్నాడు. ఆ సమయంలో విరాట్​తో తాను మాట్లాడానని, సారథ్యం నుంచి తప్పుకోవాలనే ఆలోచనను విరమించుకోవాలని కోరినట్లు గంగూలీ తెలిపాడు. అనంతరం వన్డే కెప్టెన్సీ కోల్పోయిన కోహ్లీ.. టీ20 నుంచి వైదొలిగినప్పుడు తనతో ఎవరూ మాట్లాడలేదని, దాదా ఎందుకు అలా చెప్పాడో తనకు తెలియదని మీడియాతో చెప్పాడు.

విరాట్​ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు గంగూలీకి కోపం తెప్పించాయని, దీంతో అతడికి షోకాజ్​ నోటీసులు పంపించాలని అనుకున్నట్లు సదరు ప్రతినిధి వెల్లడించారు. ఈ విషయమై దాదా.. బీసీసీఐ సభ్యులతో కూడా చర్చించాడని చెప్పారు. అయితే బోర్డు సభ్యులందరూ కలిసి.. ఈ వివాదం పెద్దది చేయొద్దని సూచించడం వల్ల దాదా తన ఆలోచనను విరమించుకున్నాడని పేర్కొన్నారు.

కాగా, తొలి వన్డేలో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి చెందిన టీమ్​ఇండియా రెండో వన్డే ఆడేందుకు సిద్ధమైంది. శుక్రవారం(జనవరి 21) ఈ మ్యాచ్​ జరగనుంది.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇందుకే కోహ్లీ.. టెస్టు కెప్టెన్సీ వదులుకున్నాడా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.