ETV Bharat / sports

ఐపీఎల్‌ కోసం ఆ సిరీస్​కు దూరమైన కేన్​ విలియమ్సన్!

author img

By

Published : Mar 14, 2023, 2:09 PM IST

Kane Williamson to be release early for IPL 2023
ఐపీఎల్‌ కోసం ఆ సిరీస్​కు దూరమైన కేన్​ విలియమ్సన్!

ఐపీఎల్ కోసం లంకతో జరగనున్న వన్డే సిరీస్​కు దూరమవ్వనున్నాడు న్యూజిలాండ్ ​కెప్టెన్​ కేన్ విలియమ్సన్​. ఆ దేశ క్రికెట్​ బోర్డు కూడా ఈ మెగా లీగ్​ కోసం అతడిని విడిచిపెట్టనున్నట్లు తెలిసింది. ఆ వివరాలు..

ఐపీఎల్.. ఈ మెగాలీగ్​కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని చిన్న క్రికెటర్ల నుంచి మేటి​ క్రికెటర్ల వరకు ఈ మెగా టోర్నీలో ఆడేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ లీగ్​లో తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ టోర్నీ నిర్వహించే సమయంలో సొంత దేశంలో సిరీస్‌లు ఉన్నా.. ఇందులో ఆడేందుకు ఇంట్రెస్ట్​ చూపుతుంటారు. ఇప్పుడి న్యూజిలాండ్​ కెప్టెన్​ విలియమ్సన్​ కూడా అదే చేశాడు! ఐపీఎల్ కోసం.. అతడిని ఆ దేశ క్రికెట్​ బోర్డు ముందే విడిచిపెట్టనుంది. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆడుతున్న విలియమ్సన్‌ వన్డేలకు అందుబాటులో ఉండట్లేదు. దీంతో ఆ వన్డే సిరీస్‌లో కివీస్‌ టీమ్​కు టామ్ లాథమ్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.

ఇకపోతే గతేడాది జరిగిన ఐపీఎల్ ఆక్షన్​లో విలియమ్సన్​ను.. గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో మంచి ఫామ్‌లో ఉన్న అతడు.. ఇక ఐపీఎల్‌లో సత్తా చాటేందుకు ఎంతో ఆత్రుతగా ఉన్నాడు. న్యూజిలాండ్ జట్టు.. ఐపీఎల్ కోసం విలియమ్సన్​తో పాటు డేవాన్ కాన్వే(చెన్నై సూపర్ కింగ్స్), టిమ్ సౌథీ(కోల్‌కతా నైట్ రైడర్స్), మిచెల్ సాంట్నర్​ను(చెన్నై సూపర్ కింగ్స్) కూడా వదిలిపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక వీరి స్థానంలో న్యూజిలాండ్‌ జట్టులో కొత్త యంగ్​ ప్లేయర్లు ఆడనున్నారు. ఇప్పటికే లంకతో మూడు వన్డేల సిరీస్​ కోసం చాడ్ బోవాస్, బెన్ లిస్టర్‌ను న్యూజిలాండ్​ బోర్డ్ సెలెక్ట్​ చేసింది. అలానే మార్చి 25న జరగనున్న తొలి వన్డే తర్వాత లోకీ ఫెర్గ్యూసన్(కోల్‌కతా నైట్ రైడర్స్), ఫిన్ అలెన్(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), గ్లెన్ ఫిలిప్(సన్‌రైజర్స్ హైదరాబాద్) కూడా ఐపీఎల్ కోసం భారత్‌కు చేరుకోనున్నారు.

ఈ విషయంపై న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ... "జట్టులో ఎప్పుడూ కొత్త ప్లేయర్స్​ ఉండటం మంచి వాతావరణాన్ని సృష్టిస్తుంది. అలాగే నిర్దిష్ట ఫార్మాట్‌లో ఆటగాళ్లకు అవకాశాలిచ్చి తీర్చిదిద్దడం ఎప్పుడూ ఉత్తేజకరంగా ఉంటుంది." అని పేర్కొన్నారు. కాగా, లంకతో జరిగిన తొలి టెస్టులో విలియమ్సన్(121 నాటౌట్‌; 194 బంతుల్లో 11×4, 1×6) అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ఆఖరి బంతి వరకు పోరాడి న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. అతడు అద్భుత సెంచరీ బాదటంతో.. ఈ మ్యాచ్​లో శ్రీలంక రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో కివీస్​ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. అలా ఈ మ్యాచ్​లో కివీస్​ గెలవడం.. లంక ఓడిపోవడం వల్ల ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరేందుకు భారత్‌కు మార్గం సుగుమమైంది.

ఇదీ చూడండి: ఇక వన్డే సిరీస్ సమరం​.. బరిలోకి డబుల్​ సెంచరీ వీరులు.. ప్లేయింగ్​ 11 ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.