ETV Bharat / sports

టీమ్​ఇండియాతో టీ20 సిరీస్​కు కేన్​ విలియమ్సన్​ దూరం

author img

By

Published : Nov 16, 2021, 10:36 AM IST

Updated : Nov 16, 2021, 11:25 AM IST

kane williamson
కేన్​ విలియమ్సన్​

10:31 November 16

కేన్​ విలియమ్సన్​ దూరం

టీమ్​ఇండియాతో(new zealand cricket team vs india) జరగనున్న టీ20 సిరీస్​కు న్యూజిలాండ్​ కెప్టెన్​ కేన్​ విలియమ్సన్(kane williamson recent news)​ దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్​ క్రికెట్​ బోర్డు ప్రకటించింది(new zealand cricket team vs india). నవంబరు 25నుంచి కాన్పూర్​లో జరగనున్న టెస్ట్​ సిరీస్​పై మరింత దృష్టి పెట్టేందుకు అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. టిమ్​ సౌథీ తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తాడని ప్రకటించింది.  

కైల్​ జేమీసన్​​, డారిల్ మిచెల్​, గ్లెన్​ ఫిలిప్స్​, మిచెల్​ స్నాటర్​ టీ20, టెస్టులకు అందుబాటులో ఉంటారని తెలిపింది బోర్డు. ఇటీవలే గాయపడిన ఫెర్గూసన్ టీ20 సిరీస్​లో​ పాల్గొనే అవకాశముందని చెప్పింది.

ఇరు జట్ల మధ్య నవంబరు 17, 19, 21న జైపూర్​, రాంచీ, కోల్​కతా వేదికగా టీ20 సిరీస్​, కాన్పూర్(25-29), ముంబయి(డిసెంబరు 3-7) టెస్ట్​ సిరీస్​ జరగనున్నాయి.  ​

ఇదీ చూడండి: వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​ వేదికలు ఖరారు

Last Updated :Nov 16, 2021, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.