ETV Bharat / sports

Ishan kishan: ధోని, పంత్​లను దాటేసిన ఇషాన్​ కిషన్​

author img

By

Published : Feb 25, 2022, 1:51 PM IST

ishan kishan
ఇషాన్​ కిషన్​

Ishan kishan: టీమ్​ ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన వికెట్​ కీపర్​గా నిలిచాడు యువ బ్యాటర్ ఇషాన్​ కిషన్. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో అద్భుత ప్రదర్శనతో ఈ ఘనత దక్కించుకున్నాడు.

Ishan kishan: భారత బ్యాటర్ ఇషాన్​ కిషన్​ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇండియా తరఫున టీ20లో ఒక మ్యాచులో అత్యధిక పరుగులు చేసిన వికెట్​ కీపర్​గా నిలిచాడు. ​రిషబ్​ పంత్​ పేరిట ఈ రికార్డును శ్రీలంకతో జరిగిన టీ20లో 56 బంతుల్లో 89 పరుగులతో బ్రేక్ చేశాడు. ఈ క్రమంలోనే మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ, కేఎల్​ రాహుల్​లను సైతం వెనక్కునెట్టాడు. వికెట్​ కీపర్​గా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో పంత్​ 65, రాహుల్​ 57, ధోనీ 56 పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

శ్రీలంకతో టీ20 సిరీస్​కు రిషబ్​ పంత్​కు విశ్రాంతినివ్వగా, కేఎల్​ రాహుల్​ గాయపడ్డాడు. తొలి మ్యాచ్​లో కెప్టెన్ రోహిత్​ శర్మతో కలిసి మెుదటి వికెట్​కు 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఇషాన్​. రోహిత్​ 32 బంతుల్లో 44 పరుగులు చేశాడు.

శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచులో భారత్​ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన రోహిత్​సేన.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులకే పరిమితమైంది. చరిత్‌ అసలంక (47 బంతుల్లో 53 నాటౌట్‌; 5 ఫోర్లు) రాణించాడు.

ఇదీ చదవండి: లంకపై భారత్ గెలుపు.. బ్యాటర్​గా రోహిత్ సరికొత్త రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.