ETV Bharat / sports

'కోహ్లీ నుంచి బెంగళూరు జట్టు ఆశించేది అదే'

author img

By

Published : May 1, 2022, 5:54 PM IST

Virat Kohli IPL 2022
సునీల్​ గావస్కర్​, విరాట్​ కోహ్లీ

Virat Kohli IPL 2022: గుజరాత్​తో జరిగిన మ్యాచ్​లో అర్ధశతకం సాధించి కోహ్లీ తనకు కావాల్సిన ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నాడని, అతడి నుంచి బెంగళూరు ఆశించేది అదేనని పేర్కొన్నారు సునీల్​ గావస్కర్​. ఇలాంటి కీలక బ్యాట్స్​మన్​ పరుగులు చేయటం చాలా మంచి విషయమని తెలిపారు.

Virat Kohli IPL 2022: బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ గుజరాత్‌తో ఆడిన మ్యాచ్‌లో అర్ధ శతకం సాధించడం ద్వారా తనకు కావాల్సిన ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నాడని దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. కోహ్లీ నుంచి బెంగళూరు జట్టు కూడా ఇదే ఆశిస్తుందని చెప్పాడు. ఇప్పటికే 5 విజయాలు, 5 ఓటములతో కొనసాగుతున్న ఆ జట్టుకు కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావడం ఊరటనిచ్చే విషయమని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు 0, 0, 9 పరుగులతో విఫలమైన కోహ్లీ (58; 53 బంతుల్లో 6x4, 1x6) గుజరాత్‌తో మెరిశాడు. ఈ నేపథ్యంలో గావస్కర్‌ స్పందించాడు.

"కోహ్లీతో పాటు బెంగళూరు జట్టుకు కావాల్సింది ఇదే. ఒక్కసారి అతడు గాడిలో పడి అర్ధశతకం సాధిస్తే మిగతా మ్యాచ్‌ల్లోనూ ఇలాగే రాణించడానికి దోహదపడుతుంది. ఇలాంటి కీలక బ్యాట్స్‌మన్‌ పరుగులు చేయడం చాలా మంచి విషయం. ఈ మ్యాచ్‌లో కోహ్లీ క్రీజులో ఉండగా తన కాలి కదలికలు కూడా బాగున్నాయి. ఇది అతడికి ఆత్మవిశ్వాసం పెంపొందించే ఇన్నింగ్స్‌. దీంతో బెంగళూరు జట్టు కూడా చాలా సంతోషించి ఉంటుంది."

- సునీల్​ గావస్కర్‌

యువ బ్యాటర్​ రజత్‌ పాటిదార్‌ గురించి మాట్లాడిన సన్నీ.. మూడో స్థానంలో ఈ యువకుడు సరిగ్గా సరిపోయాడని చెప్పాడు. డుప్లెసిస్‌ ఔటయ్యాక టాప్‌ క్లాస్‌ బ్యాటింగ్‌ చేశాడని మెచ్చుకున్నాడు. అతడు జట్టు నమ్మకాన్ని కాపాడినట్టు చెప్పాడు. బెంగళూరుతో శనివారం జరిగిన మ్యాచ్​లో గుజరాత్​ విజయం సాధించింది.

ఇదీ చూడండి: గొప్పలకు పోయిన పాక్‌ బౌలర్‌.. 160కి.మీ వేగంతో బంతులేశాడట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.