ETV Bharat / sports

లఖ్​నవూ కెప్టెన్​గా కేఎల్ రాహుల్​.. కొత్త కోచ్​ నియామకం!

author img

By

Published : Dec 17, 2021, 6:26 PM IST

kl rahul
కేఎల్ రాహుల్

KL Rahul Lucknow Franchise: పంజాబ్ కింగ్స్​కు రెండేళ్లు కెప్టెన్​గా చేసిన కేఎల్​ రాహుల్​.. కొత్త జట్టు లఖ్​నవూకు సారథిగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. లఖ్​నవూ ఫ్రాంచైజీ రూ. 20కోట్లను కేఎల్ రాహుల్​కు ఇవ్వలనుకుంటున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మరోవైపు లఖ్​నవూ జట్టు హెడ్​ కోచ్​గా జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్ నియమితులయ్యాడు.

KL Rahul Lucknow Franchise: పంజాబ్ కింగ్స్ జట్టుకు సారథ్యం వహించిన కేఎల్​ రాహుల్​.. ఇకపై కొత్త ఫ్రాంచైజీ లఖ్​నవూ జట్టుకు కెప్టెన్​గా మారనున్నాడట! త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

మరోవైపు జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్​.. లఖ్​నవూ జట్టు హెడ్​కోచ్​గా నియమితులయ్యాడు. ఆండీ ఫ్లవర్​ అంతకుముందు పంజాబ్ కింగ్స్ మాజీ అసిస్టెంట్ కోచ్​గా చేశాడు.

రాహుల్​ను లఖ్​నవూ జట్టు సొంతం చేసుకుందా?

KL Rahul Lucknow Team: అయితే ఇదే విషయంపై అధికారిక ప్రకటన రాకపోయినా.. లఖ్​నవూ ఐపీఎల్ ఫ్రాంచైజీ రూ. 20కోట్లకు పైనే కేఎల్ రాహుల్​కు ఆశచూపినట్లు తెలుస్తోంది. సన్​రైజర్స్ బౌలర్ రషీద్​ ఖాన్​కు రూ.16 కోట్లు ఆఫర్​ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై ఇప్పటికే పంజాబ్, హైదరాబాద్ జట్లు.. బీసీసీఐకు ఫిర్యాదు చేశాయి. ఆర్​పీఎస్​జీ గ్రూప్.. తమ ఆటగాళ్లకు ఎర వేస్తుందని ఆరోపించాయి. ఇదే విషయంపై బీసీసీఐ కూడా స్పందించింది. తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు కానీ వెర్బల్ కంప్లైంట్ అందిందని.. దాని ప్రకారం ఈ వ్యవహారంపై దృష్టి సారిస్తున్నామని ఓ అధికారి తెలిపారు.

లఖ్​నవూ టీమ్​ హెడ్​కోచ్​గా ఆండీ..

Andy Flower Lucknow Franchise: జింబాబ్వే జట్టు మాజీ సారథి ఆండీ ఫ్లవర్​.. లఖ్​నవూ జట్టు హెడ్​కోచ్​గా నియమితులయ్యాడు. ఆండీ ఫ్లవర్​ అంతకుముందు పంజాబ్ కింగ్స్ అసిస్టెంట్​ కోచ్​గా చేశాడు.

లఖ్​నవూ హెడ్​కోచ్​గా నియామకం కావడంపై ఆండీ ఫ్లవర్ హర్షం వ్యక్తం చేశాడు. కొత్త ఫ్రాంచైజీలో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురూచూస్తున్నానని అన్నాడు. భారత్​లో ఉండటం, ఆడటం, కోచింగ్​.. తనకెంతో ఇష్టం అని తెలిపాడు.

రెండు కొత్త జట్లు..

2022 IPL Teams: 2022 ఐపీఎల్ సీజన్​లో ఈ సారి 10జట్లు పోటీపడనున్నాయి. లఖ్​నవూ, అహ్మదాబాద్​ జట్లు తొలిసారిగా ఐపీఎల్​ బరిలోకి దిగనున్నాయి. లఖ్​నవూ ఐపీఎల్ జట్టును ఆర్​పీఎస్​జీ గ్రూప్​ కొనుగోలు చేసింది. అయితే ఈ జట్టుకు ఇంకా పేరును ఖరారు చేయలేదు. అయితే డిసెంబరు 25లోగా కొత్త ఫ్రాంచైజీలకు సంబంధించి.. కొత్త సారథి, కోచ్, టైటిల్ స్పాన్సర్​లను ప్రకటించాలని ఇదివరకే బీసీసీఐ గడువు ఇచ్చింది.

"అహ్మదాబాద్ ఫ్రాంచైజీతోపాటు లఖ్​నవూ ఫ్రాంచైజీకు మూడు సైనింగ్​లు పూర్తయ్యేవరకు సమయమిస్తాం. ఆ తర్వాత ఆటగాళ్ల వేలం, ఇతర కార్యక్రమాలు జరుగుతాయి" అని బీసీసీఐకు చెందిన ఓ అధికారి తెలిపారు.

ఇదీ చూడండి: మరో టోర్నీలో సింధు ఓటమి.. శ్రీకాంత్​కు పతకం ఖరారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.