ETV Bharat / sports

మళ్లీ ఓడిన సింధు.. శ్రీకాంత్​కు పతకం ఖరారు

author img

By

Published : Dec 17, 2021, 4:32 PM IST

Updated : Dec 17, 2021, 10:49 PM IST

Sindhu
సింధు

BWF World Championships: ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్స్​ క్వార్టర్​ ఫైనల్స్​లో భారత స్టార్ షట్లర్​ పీవీ సింధు ఓటమి పాలైంది. అలానే పురుషుల సింగిల్స్​ సెమీస్​లో అడుగుపెట్టిన శ్రీకాంత్ పతకం ఖరారు చేసుకున్నాడు.

BWF World Championships: బీడబ్ల్యూఎఫ్​​ ఛాంపియన్​షిప్స్​ క్వార్టర్ ఫైనల్స్​లో భారత షట్లర్ పీవీ సింధు ఓడిపోయింది. ప్రపంచ టాప్​, చైనాకు చెందిన సీడ్​ తై జు యింగ్​(చైనీస్​ తైపీ)​ చేతిలో వరుస సెట్లలో 21-17, 21-13 తేడాతో ఓటమి పాలైంది. దీంతో సింధు టైటిల్ ఆశలు చేజారాయి. హెడ్ టూ హెడ్ మ్యాచ్​ల్లో 15-5 తేడాతో సింధు కంటే ముందంజలో ఉంది తై జు యింగ్​.

గతేడాది టోక్యో ఒలింపిక్స్​ సెమీ ఫైనల్​లోనూ తై జు యింగ్​ చేతిలోనే ఓటమి చవిచూసింది సింధు.

PV Sindhu World Championship: అంతకు ముందు గురువారం ప్రీ క్వార్టర్ ఫైనల్స్​ మ్యాచ్​లో ప్రపంచ పదో సీడ్​ చోచువాంగ్​పై 21-14, 21-18తో ఏడో సీడ్​ సింధు విజయం సాధించి.. క్వార్టర్ ఫైనల్స్​లో అడుగుపెట్టింది.

శ్రీకాంత్ విజయం..

BWF World Championships: బీడబ్ల్యూఎఫ్ ఛాంపియన్​షిప్స్​ క్వార్టర్స్​లో భారత షెట్లర్​ కిదాంబి శ్రీకాంత్ విజయం సాధించాడు. నెదర్లాండ్స్​ ప్లేయర్ మార్క్ కాలిజోపై 21-8, 21-7 తేడాతో విజయం సాధించాడు. ఈ విజయంతో ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్స్​లో పతకం ఖరారు చేసుకున్నాడు. తద్వారా ఈ టోర్నీలో మెడల్ సాధించిన మూడో భారతీయుడిగా నిలిచాడు. స్పెయిన్​లోని హుయెల్వాలో సెమీఫైనల్ జరగనుంది.

లక్ష్యసేన్​కు పతకం ఖరారు..

మరోవైపు భారత షట్లర్​ లక్ష్యసేన్​కు పతకం ఖరారైంది. శుక్రవారం జరిగిన క్వార్టర్​ ఫైనల్​​లో చైనాకుచెందిన జున్​ పెంగ్​ జావోపై 21-15, 15-21, 22-20 తేడాతో విజయం సాధించాడు. సెమీఫైనల్ మ్యాచ్​ శనివారం జరగనుంది.

ఇక మరో షట్లర్​ ప్రణయ్ క్వార్టర్​ ఫైనల్​​లో ఓటమి పాలయ్యాడు. సింగపుర్​కు చెందిన కీన్ యూ లోహ్​పై 14-21, 12-21 తేడాతో ఓటమి పాలయ్యాడు.

ఇదీ చూడండి: ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్స్​ క్వార్టర్స్​లో సింధు, శ్రీకాంత్

Last Updated :Dec 17, 2021, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.