ETV Bharat / sports

విజృంభించిన ఆర్సీబీ బౌలర్లు.. రాజస్థాన్​పై 112 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ

author img

By

Published : May 14, 2023, 6:32 PM IST

Updated : May 14, 2023, 7:14 PM IST

rcb vs rr
rcb vs rr

ఐపీఎల్ సీజన్​ 16లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు తలపడ్డాయి. ఇరు జట్లకు కీలకమైన ఈ మ్యాచ్​లో రాజస్థాన్ పై బెంగళూరు 112 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ సీజన్ 16లో సవాయ్ మాన్​సింగ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్​ పై 112 పరుగుల తేడాతో బెంగళూరు ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో రాజస్థాన్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. మొదట బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ మొదటి ఓవర్​ నుంచే వికెట్లు కోల్పోయింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు రాజస్థాన్‌ 59 పరుగులకే కుప్పకూలింది. బెంగళూరు బౌలర్లలో పార్నెల్‌ 3, బ్రాస్‌వెల్ 2, కర్ణ్ శర్మ 2, సిరాజ్‌, మ్యాక్స్‌వెల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో బెంగళూరు 12 పాయింట్లతో ఐదో స్థానానికి చేరింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు.. కెప్టెన్ డుప్లెసిస్ (44 బంతుల్లో 55 పరుగులు: 3x4, 2x6), మాక్స్​వెల్​ (33 బంతుల్లో 54 పరుగులు: 5x4, 3x6) హాఫ్​ సెంచరీలతో మెరిశారు. విరాట్ కోహ్లీ 18 పరుగులకే పెవిలియన్ చేరాడు. లామ్​రోర్​(1), దినేశ్ కార్తీక్ డకౌట్​గా వెనుదిరిగాడు. చివర్లో అనూజ్ రావత్ 29 పరుగులతో రాణించాడు. రాజస్థాన్ బౌలర్లలో జంపా, ఆసిఫ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. సందీప్​ శర్మ ఒక వికెట్ తీశాడు.

బెంబేలెత్తించిన బెంగళూరు బౌలర్లు.. ఈ సీజన్​లో మొదటిసారి ఆర్​సీబీ బౌలర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. మొదటి నుంచే పట్టు తప్పకుండా లైన్ అండ్​ లెంగ్త్​తో బంతులు సంధించారు. వీరి ధాటికి ఓపెనర్లు జైస్వాల్, బట్లర్ ఇద్దరూ డకౌటయ్యారు. మొదటి ఓవర్లో జైస్వాల్​ను సిరాజ్​ ఔట్​ చేయగా.. రెండో ఓవర్లో పార్నెల్ బట్లర్​ను పెవిలియన్​ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శాంసన్​ సహా రూట్, పడిక్కల్, ధృవ్​ జోరెల్ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయారు. దీంతో పవర్​ ప్లే ముగిసే సరికి రాజస్థాన్ 28-5 తో పీకల్లోతు కష్టాల్లో మునిగింది. ఈ దశలో హిట్​మయర్ కరణ్ శర్మ బౌలింగ్​లో మూడు సిక్లర్లు బాది టచ్​లోకి వచ్చినట్లు కనిపించినా మరో ఎండ్​లో వికెట్లు పడుతూనే ఉన్నాయి. 10.3 ఓవర్లలోనే రాజస్థాన్ ఆలౌటైంది. 59లో హిట్​మయర్​వే 35 పరుగులు. కాగా రాజస్థాన్ ఇన్నింగ్స్​లో నలుగురు బ్యాటర్లు డకౌట్ అవ్వటం గమనార్హం.

డుప్లెసిస్​@4000.. బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ ఈ మ్యాచ్​లో ఓ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్​లో 4 వేల పరుగుల మైలురాయిని అందుకున్న 15 వ ఆటగాడిగా నిలిచాడు. 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు ఈ ఫీట్ సాధించాడు. కాగా ప్రస్తుత సీజన్​లో 631 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్​ రేసులో ప్రథమ స్థానంలో ఉన్నాడు. ఇందులో ఏడు అర్ధ శతకాలు ఉన్నాయి.

Last Updated :May 14, 2023, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.