ETV Bharat / sports

IPL 2022: సూర్యకుమార్ మెరుపులు.. బెంగళూరు లక్ష్యం ఎంతంటే?

author img

By

Published : Apr 9, 2022, 9:27 PM IST

royal challengers bangalore vs mumbai
IPL 2022

IPL 2022: రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో మ్యాచ్​లో అర్ధశతకంతో రాణించాడు సూర్యకుమార్ యాదవ్. దీంతో బెంగళూరుకు 152 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ముంబయి.

IPL 2022: రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్​లో టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ముంబయి ఇండియన్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 151/6 పరుగులు చేసింది. సూర్యకుమార్​ యాదవ్​ (68) హాఫ్​ సెంచరీతో రాణించాడు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (26), రోహిత్ శర్మ (26) శుభారంభాన్ని అందించినా.. ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది ముంబయి. ఈ క్రమంలోనే ఆ జట్టు స్కోరు నెమ్మదించింది. దీంతో వికెట్​ను కాపాడుకుంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన సూర్య.. బెంగళూరు ముందు 152 పరుగుల లక్ష్యాన్ని నిలిపేలా చేశాడు.

బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 2, హసరంగ 2, ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.