ETV Bharat / sports

IPL 2022: చెన్నై బోణీ.. బెంగళూరును ముంచేసిన మహీశ్ తీక్షణ

author img

By

Published : Apr 12, 2022, 11:28 PM IST

IPL 2022
csk vs rcb

IPL 2022: ఐపీఎల్​ 2022లో తొలి విజయాన్ని నమోదు చేసింది చెన్నైసూపర్ కింగ్స్​. 217 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 193/9 పరుగులకే పరిమితమైంది ఆర్సీబీ. దీంతో 23 పరుగుల తేడాతో చెన్నై గెలిచింది.

IPL 2022: ఐపీఎల్​ 2022లో చెన్నై బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన మ్యాచ్​లో బెంగళూరుపై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 217 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 193/9 కే పరిమితమైంది ఆర్సీబీ. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్ (8), అనూజ్ రావత్ (12)​, విరాట్​ కోహ్లీ (1) సహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. అయితే గ్లెన్​ మ్యాక్స్​వెల్ (26), షాబాజ్ అహ్మద్ (41), సుయష్ ప్రభుదేశాయ్ (34), దినేశ్​ కార్తీక్​(34) పోరాడే ప్రయత్నం చేశారు. మహమ్మద్​ సిరాజ్​(14), జోష్​ హేజిల్​వుడ్​(7) నాటౌట్​గా నిలిచారు. చెన్నై బౌలర్లలో మహీశ్​ తీక్షణ 4, రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టగా.. ముఖేశ్, బ్రావో తలో ఒక వికెట్ తీశారు.

అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన సీఎస్​కే నిర్ణీత 20 ఓవర్లలో 216/4 పరుగులు చేసింది. 10 ఓవర్లకు 60 పరుగుల వద్ద ఉన్న స్థాయి నుంచి సిక్సర్లు, ఫోర్లతో మోతమోగించారు ఉతప్ప (50 బంతుల్లో 88), శివం దూబె (95). దీంతో బెంగళూరుకు 217 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది చెన్నై. ఓపెనర్ రుతురాత్​ గైక్వాడ్ (17)​ మరోసారి స్వల్ప స్కోరుకే పరిమితమయ్యాడు. మొయిన్​ అలీ (3) రనౌట్​గా వెనుదిరిగాడు. బెంగళూరు బౌలర్లలో హసరంగ 2, జోష్ హేజిల్​వుడ్ ఒక వికెట్ పడగొట్టారు.

ఇదీ చదవండి: Virat Kohli: అరుదైన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.