ETV Bharat / sports

ఐపీఎల్: 'ఆసీస్​ ఆటగాళ్లకు ప్రత్యేక విమానాల్లేవు'

author img

By

Published : May 3, 2021, 5:38 PM IST

Updated : May 3, 2021, 5:53 PM IST

తమ ఆటగాళ్లను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాట్లేం ప్రస్తుతం చేయట్లేదని ఆసీస్​ క్రికెట్ బోర్డు తెలిపింది. తమ ప్లేయర్స్​, బీసీసీఐతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది.

aus players
ఆసీస్​ ఆటగాళ్లు

కరోనా విజృంభణ దృష్ట్యా భారత్​ నుంచి విమాన రాకపోకలను మే15 వరకు నిలిపివేస్తున్నట్లు ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ఈ కారణంగానే పలువురు ఆసీస్​ ఆటగాళ్లు ఐపీఎల్​ ​నుంచి తప్పుకోగా, మరికొందరు సీజన్​ను మధ్యలోనే వీడేందుకు సిద్ధమవుతున్నారు. తమను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలని కొంతమంది ఆటగాళ్లు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే తమ క్రికెటర్లను వెనక్కు తీసుకొచ్చే తక్షణ చర్యలు ఏమీ తీసుకోవట్లేదని ఆసీస్ బోర్డు తాత్కాలిక సీఈఓ నిక్​ హాక్లే చెప్పారు.

"ఆటగాళ్ల కోసం ఇప్పుడు ప్రత్యేక విమానాలు ఏం ఏర్పాటు చేయట్లేదు. ఆస్ట్రేలియా బోర్డు.. బీసీసీఐ, ఆటగాళ్లతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోంది. పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాం. ఆటగాళ్ల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. లీగ్​ పూర్తయ్యేవరకు జాగ్రత్తగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వారు చెప్పారు. బీసీసీఐ వారిని సురక్షితమైన బయో బబుల్​లో ఉంచింది. ప్లేయర్స్​ తమ ఇంటికి చేరేవరకు సురక్షితంగా చూసుకుంటామని బోర్డు హామీ ఇచ్చింది" అని నిక్ వెల్లడించారు.

కరోనా సెకండ్​ వేవ్​ ఉద్ధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆండ్రూ టై, ఆడమ్​ జంపా, రిచర్డ్‌సన్‌, లియామ్​ లివింగ్​స్టోన్ సహా పలువురు కంగారూ ఆటగాళ్లు ఐపీఎల్ ప్రస్తుత సీజన్​​ నుంచి తప్పుకున్నారు.

ఇదీ చూడండి: ఐపీఎల్​ బయోబబుల్​ సురక్షితం: జంపా

Last Updated : May 3, 2021, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.