ETV Bharat / sports

ఐపీఎల్ వేలం ఈసారి హైదరాబాద్​లో!

author img

By

Published : Dec 20, 2021, 9:00 PM IST

ipl 2022 mega auction news
ఐపీఎల్

IPL 2022 Mega Auction: ఐపీఎల్​ వేలంకు లైన్​ క్లియర్ అయింది. 2018 తరహాలోనే ఈసారి కూడా రెండురోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది.

IPL 2022 Mega Auction: రాబోయే సీజన్​కు సంబంధించిన ఐపీఎల్​ ఫిబ్రవరి తొలివారంలో జరగనున్నట్లు తెలుస్తోంది. రెండురోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి హైదరాబాద్ లేదా బెంగళూరు ఆతిథ్యమివ్వనున్నట్లు తెలుస్తోంది.​

ఐపీఎల్​లో ఆయా ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను ఇప్పటికే ప్రకటించాయి. కొత్త టీమ్​లు లక్నో, అహ్మదాబాద్​లు కూడా ముగ్గురు చొప్పున ఆటగాళ్లను తమ జట్టులోకి ఎంపిక చేసుకోనున్నాయి.

IPL Auction 2022: ఫ్రాంచైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ మెగా వేలం ఎప్పుడో జరగాల్సింది కానీ అహ్మదాబాద్​ ఫ్రాంచైజీపై బీసీసీఐ విచారణ కారణంగా ఆలస్యమైంది. అహ్మదాబాద్​ ఫ్రాంచైజీని బ్రిటీష్​ ప్రైవేట్ ఈక్విటీ సీవీసీ క్యాపిటల్స్ పార్టనర్స్​ రూ.5625 కోట్లకు కొనుగోలు చేశారు. దీంతో ప్రభుత్వం నుంచి క్లీన్​చిట్​ వస్తే.. బీసీసీఐ లెటర్​ ఆఫ్ ఇంటెంట్​ను ఫ్రాంచైజీకి ఇస్తుంది. ఇది క్లియర్ అయితే.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కూడా ప్లేయర్స్​ను సెలెక్ట్ చేసుకుంటుంది.

ఇదీ చదవండి:

ఐపీఎల్ రిటెన్షన్ పూర్తి జాబితా వచ్చేసింది.. ఎవరికి అత్యధిక ధరంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.