ETV Bharat / sports

దిల్లీ ప్రధాన ఆల్​రౌండర్​కు గాయం.. ఐపీఎల్​ నుంచి ఔట్​?

author img

By

Published : Mar 28, 2022, 3:11 PM IST

IPL 2022 Delhi Capitals
mitchell marsh news

IPL 2022 Delhi CapitalsMarsh injured: దిల్లీ క్యాపిటల్స్​ ఆటగాడు​ మిచెల్​ మార్ష్​ ఐపీఎల్​లో పాల్గొనేది ప్రశ్నార్థకంగా మారింది. పాకిస్థాన్​తో సిరీస్​ నేపథ్యంలో జరిగిన ప్రాక్టీస్​ మ్యాచ్​లో అతడు​ గాయపడ్డాడు. దీంతో ఈ మెగా టోర్నీకి అతడు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది.

IPL 2022 Delhi CapitalsMarsh injured: దిల్లీ క్యాపిటల్స్​కు సీజన్​ ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగలనుంది. ఆ జట్టు సభ్యుడు​ మిచెల్​ మార్ష్​ ఐపీఎల్​లో ఆడేది అనుమానంగా మారింది. మంగళవారం నుంచి పాకిస్థాన్​తో సిరీస్​ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ చేస్తుండగా మార్ష్​కు గాయమైంది. దీంతో అతడు సిరీస్​ నుంచి పూర్తిగా వైదొలగగా.. ఐపీఎల్​లో ఆడేది​ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్​ మెగావేలంలో మార్ష్​ను దిల్లీ క్యాపిటల్స్ రూ.6.5 కోట్లకు సొంతం చేసుకుంది.

30 ఏళ్ల మిచెల్​ మార్ష్​.. ఆస్ట్రేలియా తొలి టీ20 ప్రపంచకప్​ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్​తో జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. గతేడాది ఒక క్యాలెండర్​ సంవత్సరంలో ఆస్ట్రేలియా తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 36.88 సగటుతో 627 పరుగులు చేశాడు.

ఇదీ చదవండి: IPL 2022: ముంబయిపై ఘనవిజయం సాధించిన దిల్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.