ETV Bharat / sports

ప్రపంచకప్​ ఫైనల్​ తర్వాత ఈ ఫైనలే ది బెస్ట్!

author img

By

Published : Nov 10, 2020, 4:19 PM IST

ప్రపంచకప్​ ఫైనల్ తర్వాత ఐపీఎల్​ ఫైనల్​ మాత్రమే అంతలా ప్రాచుర్యం పొందిందని అభిప్రాయపడ్డాడు ఆల్​రౌండర్ పొలార్డ్. పొరపాట్లకు తావు ఇవ్వకుండా అత్యుత్తమ ప్రదర్శన చేయాలని సహచర ఆటగాళ్లకు సూచించాడు.

IPL final is the biggest thing after World Cup final, says Pollard
'ప్రపంచకప్​ ఫైనల్​ తర్వాత అంతటి పెద్ద విషయం ఇదే'

వన్డే ప్రపంచకప్ తర్వాత ఐపీఎల్ ఫైనల్​కే ఆ స్థాయిలో ప్రాచుర్యం లభించిందని ముంబయి ఇండియన్స్​ ఆల్​రౌండర్​ పొలార్డ్​ అన్నాడు. దుబాయ్​ వేదికగా మంగళవారం జరగనున్న తుదిపోరులో దిల్లీ క్యాపిటల్స్​తో తలపడనుందీ జట్టు. ఈ నేపథ్యంలోనే పొలార్డ్​ పై వ్యాఖ్యలు చేశాడు.

"ఫైనల్​ అంటేనే ప్రతి ఆటగాడు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఎవరైనా గెలవాలనే కోరుకుంటారు. పొరపాట్లు జరగకుండా ఫైనల్స్​ ఆడాలని అనుకుంటున్నాం. ఈ ఫైనల్​లో ప్రేక్షకుల ఉండరు. కానీ, దాన్ని ఆస్వాదించాలి. ప్రపంచకప్​ తర్వాత అదే స్థాయిలో ప్రాచుర్యం పొందింది ఐపీఎల్ ఫైనల్"

- కిరన్​ పొలార్డ్​, ముంబయి ఇండియన్స్​ ఆల్​రౌండర్​

ఐపీఎల్​ చరిత్రలో ముంబయి ఇండియన్స్ ఇప్పటివరకు​ నాలుగుసార్లు (2013, 2015, 2017, 2019) విజేతగా నిలిచింది. మరోవైపు దిల్లీ క్యాపిటల్స్​ జట్టు ఫైనల్​లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. క్వాలిఫయర్​-1​లో దిల్లీ​ని ఓడించిన ముంబయి తుదిపోరుకు అర్హత సాధించింది. క్వాలిఫైయిర్​-2లో​హైదరాబాద్​పై గెలిచిన దిల్లీ ఫైనల్​లో అడుగుపెట్టింది.

"ఫైనల్​ గురించి సుదీర్ఘంగా ఆలోచించడం లేదు. ప్రణాళిక ద్వారా నైపుణ్యాలను అమలు చేయడమే. ఇది బ్యాట్​కు బంతికి మధ్య పోటీ. పరుగులు, వికెట్లు రాబట్టడమే కావాల్సింది. కాబట్టి మా క్రికెటర్లంతా ఆటను ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. మా జట్టులో ఎక్కువమందికి ఫైనల్లో ఎలా ఆడాలో తెలుసు" అని ముంబయి కోచ్ మహేలా జయవర్ధనే అన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.