ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా విఫలమవుతోంది. లీగ్లో ప్రతి ఏడాది ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తూ వస్తోన్న సీఎస్కే ఈ సీజన్లో మాత్రం ఏడు మ్యాచ్ల్లో ఓడి అవకాశాల్ని దూరం చేసుకుంది. దీంతో అభిమానులు ఇంకా తమ జట్టు ప్లేఆఫ్ అవకాశాలపై చిన్న ఆశతో ఉన్నారు.
ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన ధోనీసేన ఏడింటిలో ఓటమిపాలైంది. నెట్ రన్రేట్ -4.63గా ఉంది. ఈ గణాంకాలు చూస్తే మాత్రం సీఎస్కే ప్లేఆఫ్స్కు వెళ్లడం కష్టంగానే కనిపిస్తోంది. అయితే కెప్టెన్ ధోనీతో పాటు కోచ్ ఫ్లెమింగ్ మాత్రం ఇంకా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు.
సాధ్యమేనా?
ఈ సీజన్లో చెన్నై ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాలి. ఈ మ్యాచ్లన్నింటిలో గెలిచినా.. నెట్ రన్రేట్ చాలా మెరుగ్గా ఉండాల్సి ఉంది. దీంతో ప్రతి మ్యాచ్లోనూ రన్రేట్పై దృష్టిసారించాలి. అలాగే ఇప్పటివరకు లీగ్లో నాలుగో స్థానంలో నిలిచిన జట్లను పరిశీలిస్తే ఎక్కువగా 14 పాయింట్లతో ప్లేఆఫ్స్కు అర్హత సాధించినవే. కానీ గతేడాది సన్రైజర్స్ మాత్రం కేవలం ఆరు మ్యాచ్లు గెలిచి ప్లేఆఫ్స్కు వెళ్లింది. రన్రేట్ అద్భుతంగా ఉండటం వల్ల కోల్కతాను వెనక్కి నెట్టి హైదరాబాద్ ముందుకెళ్లింది.