ETV Bharat / sports

కోహ్లీ రికార్డును అధిగమించిన పడిక్కల్​

author img

By

Published : Nov 3, 2020, 1:49 PM IST

బెంగళూరు జట్టు ఓపెనర్​ దేవదత్​ పడిక్కల్​ అరుదైన ఘనత సాధించాడు. ఈ సీజన్​లో ఐదు అర్ధ సెంచరీలు బాదిన వర్ధమాన క్రికెటర్​గా నిలిచాడు. దీంతో పాటే సీజన్లో ఆర్సీబీ తరపున అత్యధిక పరుగులు(472) చేసిన మైలురాయిని అందుకున్నాడు.

padikkal
పడిక్కల్​

ఈ ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓపెనర్​ దేవదత్ పడిక్కల్​ అరుదైన రికార్డు సాధించాడు. ఓ సీజన్​లో అత్యధికంగా ఐదు అర్ధ సెంచరీలు చేసిన వర్ధమాన క్రికెటర్​గా నిలిచాడు. అంతకుముందు శిఖర్ ధావన్(2008), శ్రేయస్ అయ్యర్(2015)లో చెరో నాలుగు అర్థ సెంచరీలతో రికార్డును నెలకొల్పారు. అప్పుడు వారిద్దరు దిల్లీ క్యాపిటల్స్​కే ప్రాతినిధ్యం వహించారు. సోమవారం దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​తో వారిద్దరి రికార్డును అధిగమించి పడిక్కల్​ ఈ మైలురాయిని అందుకున్నాడు.​

దిల్లీతో జరిగిన మ్యాచ్​లో పడిక్కల్ బెంగళూరు జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు. 40 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే ఈ సీజన్​లో ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పడిక్కల్ సారథి విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టాడు. 14 ఇన్నింగ్స్​ల్లో 472 పరుగులు చేశాడు. మొత్తంగా 51 ఫోర్లు, ఎనిమిది సిక్స్​లు బాదాడు.

ఇదీ చూడండి 'అన్ని మ్యాచ్​ల్లో ఆడనందుకు బాధపడ్డా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.