ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త గణాంకాలు నమోదయ్యాయి. లీగ్ దశ ముగిసేసరికి ముంబయి ఇండియన్స్ 18 పాయింట్లతో టాప్లో ఉండగా, రాజస్థాన్ రాయల్స్ 12 పాయింట్లతో పూర్తి దిగువన నిలిచింది. ఇలా తొలి, చివరి స్థానాల్లో ఉన్న జట్ల మధ్య 6 పాయింట్ల అంతరం ఉండటం ఇదే మొదటిసారి. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ సీజన్లో ముంబయి, దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్కు అర్హత సాధించాయి.
- ముంబయి-దిల్లీ జట్ల మధ్య గురువారం(నవంబరు 5) తొలి క్వాలిఫయర్ జరగనుంది.
- బెంగళూరు-హైదరాబాద్ జట్ల మధ్య శుక్రవారం(నవంబరు 6) ఎలిమినేటర్ పోరు ఉంది.
- క్వాలిఫయర్లో ఓడిన జట్టు, ఎలిమినేటర్లో గెలిచిన జట్టు మధ్య ఆదివారం(నవంబరు 8) క్వాలిఫయర్ 2, మంగళవారం(నవంబరు 10) ఫైనల్ జరగనుంది.
ఇవీ చదవండి: