ETV Bharat / sports

'అంపైర్​ను అరెస్టు చేయండి'.. కోహ్లీ LBWపై నెటిజన్ల ఆగ్రహం!

author img

By

Published : Feb 18, 2023, 5:38 PM IST

భారత్​ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు మ్యాచ్​లో విరాట్​ కోహ్లీ ఔటైన తీరు వివాదాస్పదమైంది. అంపైర్​ నితిన్​ మీనన్ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'అది నాటౌట్'​ అంటూ సోష్​ మీడియాలో ట్రెండ్​ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే..

virat kohli controversial lbw
virat kohli controversial lbw

బోర్డర్​-గావర్కర్​ ట్రోఫీలో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు జరుగుతోంది. రెండు రోజు భారత్​ ఇన్నింగ్స్​లో థర్డ్​ అంపైర్​ తీసుకున్న నిర్ణయం అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది. అంపైర్​పై నెటిజన్లు మండి పడుతున్నారు. అంపైర్​ను సోషల్​ మీడియాలో ట్రోల్​ చేస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే..
టీమ్ఇండియా ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 21/0తో రెండో రోజు ఆటను మొదలు పెట్టింది. 50వ ఓవర్లో మాత్యూ బౌలింగ్​లో కోహ్లీ క్రీజులో ఉన్నాడు. మాత్యూ మూడో బంతిని విరాట్​ డిఫెండ్​ చేసే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ బంతి విరాట్​ బ్యాట్​కు అతి దగ్గరగా వెళ్లి.. ప్యాడ్​ను తాకింది. వెంటనే మాత్యూ ఔట్​కు అప్పీల్ చేశాడు. దీంతో అంపైర్​ నితిన్​ మీనన్​ కోహ్లీ ఔట్​ అయినట్లు ప్రకటించాడు. అంపైర్​ నిర్ణయాన్ని కాదని వెంటనే విరాట్​ కోహ్లీ రివ్యూ కోరాడు. దీంతో అంపైర్​ పరిశీలించి.. బెనిఫిట్ ఆఫ్​ డౌట్​ కింద లెగ్ బిఫోర్​ వికెట్​(ఎల్​బీడబ్ల్యూ) ఇచ్చాడు. దీనిపై కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. కాగా, ఈ ఇన్నింగ్స్​లో కోహ్లీ 84 బంతుల్లో 44 పరుగులు చేశాడు.

అది నాటౌట్​..!
అయితే కోహ్లీని థర్డ్ అంపైర్​ ఔట్​గా ప్రకటించడంపై వివాదం చెలరేగింది. దీంతో భారత జట్టు మాజీ క్రికెటర్లు అభినవ్​ ముకుంద్, వసీం జాఫర్​ కూడా స్పందించారు. "అది నాటౌట్​. బంతి ప్యాడ్​ కన్నా ముందు బ్యాట్​కు తాకింది. థర్డ్​ అంపైర్​ నిర్ణయంలో చాలా సందేహాలున్నాయి" ​ అంటూ జాఫర్​ ట్వీట్​ చేశాడు. వీరితో పాటు సోషల్​మీడియా వేదికగా దీన్ని ఖండిస్తున్నారు నెటిజన్లు. 'అంపైర్లు ఎప్పుడూ విరాట్​ కోహ్లీకి సపోర్ట్​ చేయరు' అని ఓ నెటిజన్​ కామెంట్​ చేయగా.. కోహ్లీ సెటిల్​ అయి.. సెంచరీ బాదే సమయానికే ఇలా జరిగిందంటూ కొందరు అభిమానులు నిరాశపడుతున్నారు. 'నితిన్​ మీనన్​ కరెక్ట్​ నిర్ణయాల కన్నా.. తప్పుడు నిర్ణయాలే ఎక్కువ తీసుకుంటాడు. అతడిని అరెస్టు చేయండి' అని అంపైర్​ నితిన్ మీనన్​పై విరుచుకుపడుతున్నారు. నాట్​ఔట్ అనే హ్యాష్​ ట్యాగ్​ను ట్రెండ్​ చేస్తున్నారు. ​ కాగా, ఈ మ్యాచ్​లో లయోన్​ నాథన్​ అద్భుత ప్రదర్శన చేశాడు. ఐదు వికెట్లు బడగొట్టి భారత భారత బ్యాటర్లకు సవాల్​ విసిరాడు. దీంతో టీమ్ఇండియాపై 100 వికెట్లు తీసిన మూడో క్రికెటర్​గా రికార్డు సృష్టించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.