ETV Bharat / sports

17 ఏళ్లలో 5 విజయాలు- సఫారీ గడ్డపై సిరీస్ కల నెరవేరేది ఎప్పుడో?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2024, 3:44 PM IST

India Test Wins In South Africa
India Test Wins In South Africa

India Test Wins In South Africa: సౌతాఫ్రితా గడ్డపై టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్​ల్లో విజయం సాధించింది. మరి టీమ్ఇండియా ఎప్పుడెప్పుడు ఆ విజయాలు నమోదు చేసిందో చూద్దాం.

India Test Wins In South Africa: భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికా పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో 1-1 టీ20 సిరీస్ సమం కాగా, 2-1 తేడాతో వన్డే సిరీస్​ను పట్టేసింది టీమ్ఇండియా. ఇక రీసెంట్​గా రెండు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ను కూడా 1-1తో ముగించి సిరీస్​ను డ్రా చేసుకుంది. అయితే గత మూడు దశాబ్దాలుగా సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గని టీమ్ఇండియా, 5 మ్యాచ్​ల్లో విజయం అందుకుంది. మరి ఆ విజయాలు ఎప్పుడెప్పుడు ఏ వేదికలో నమోదయ్యాయో తెలుసుకుందాం.

భారత్​ vs సౌతాఫ్రికా- జొహెన్నస్​బర్గ్, 2006

  • 2006లో టీమ్ఇండియా, సౌతాఫ్రికాలో పర్యటించినప్పుడు టెస్టుల్లో సఫారీ గడ్డపై తొలి విజయాన్ని రుచి చూసింది. ఈ మ్యాచ్​లో భారత్ వరుసగా రెండు ఇన్నింగ్స్​ల్లో (249-10, 236-10) స్కోర్లు చేసింది. ఇక ఆతిథ్య సౌకాఫ్రికా (84-10, 278-10) స్కోర్లకు పరిమితమైంది. దీంతో భారత్ 123 పరుగుల విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్​లో మాజీ పేసర్ శ్రీశాంత్ (5-40, 3-59) ఎనిమిది వికెట్లతో అదరగొట్టాడు.

భారత్​ vs సౌతాఫ్రికా- డర్బన్, 2010

  • సౌతాఫ్రికా గడ్డపై 2006లో టెస్టుల్లో తొలి విజయం అందుకున్న టీమ్ఇండియాకు రెండో విక్టరీ కొట్టేందుకు దాదాపు నాలుగేళ్లు పట్టింది. 2010లో టీమ్ఇండియా రెండో మ్యాచ్​లో నెగ్గి సిరీస్​ను డ్రా చేసుకుంది. ఆ మ్యాచ్​లో రెండు ఇన్నింగ్స్​ల తర్వాత సౌతాఫ్రికా ముందు 303 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది టీమ్ఇండియా. ఛేదనలో తడబడ్డ సఫారీ జట్టు 215 పరుగులకే ఆలౌటైంది. ఆ మ్యాచ్​లో (38,96)స్కోర్లు చేసిన వీవీఎస్ లక్ష్మణ్​కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

భారత్​ vs సౌతాఫ్రికా- జొహెన్నస్​బర్గ్, 2018

  • దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత టీమ్ఇండియా మూడో గెలుపును నమోదు చేసింది. 2018లో జొహెన్నస్​బర్గ్​లో జరిగిన మ్యాచ్​లో భారత్ నిర్దేశించిన 255 పరుగులను ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా 63 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్​లో భువనేశ్వర్ కుమార్ ఏకంగా ఎనిమిది వికెట్లతో చెలరేగాడు.

భారత్​ vs సౌతాఫ్రికా- జొహెన్నస్​బర్గ్, 2021

  • 2021లో జరిగిన టెస్టు సిరీస్​లో టీమ్ఇండియా 113 పరుగుల తేడాతో నెగ్గి, సౌతాఫ్రికాలో నాలుగో విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (123) సెంచరీతో అదరగొట్టగా, మహ్మద్ షమీ ఎనిమిది వికెట్లతో రాణించాడు. కానీ, ఈ సిరీన్​ను 2-1తో సౌతాఫ్రికా గెలుచుకుంది.

భారత్​ vs సౌతాఫ్రికా- కేప్​టౌన్, 2024

  • తాజాగా ముగిసిన పర్యటనలో భారత్, సఫారీ గడ్డపై ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఇదే పర్యటనలో తొలి మ్యాచ్​లో ఓడిన టీమ్ఇండియా రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్​లో 176 పరుగులు చేసి భారత్​కు 79 స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం టీమ్ఇండియా 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఇక సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ నెగ్గడం మాత్రం టీమ్ఇండియాకు మూడు దశాబ్దాలుగా కలగానే ఉంది. ప్రస్తుతం అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న టీమ్ఇండియా ఈ పర్యటనలో సిరీస్ తప్పక గెలుస్తుందని భావించారు అభిమానులు. కానీ, అది నెరవేరలేదు. దీం

'భారత్ పిచ్​లపై మాట్లాడే వారు నోరు మూసుకోవాలి- మా వద్ద బంతి తిరిగితే ఒప్పుకోరా?'తో సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవడం కోసం మరికొంత కాలం ఎదురు చూడాల్సిందే.

ఒకటిన్నర రోజుల్లోనే మ్యాచ్ కంప్లీట్- సెకండ్ టెస్ట్​లో భారత్ విజయం- సిరీస్ సమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.