ETV Bharat / sports

IND Vs SA Match Black Tickets : రూ.2500 టికెట్​ రూ.11 వేలకు విక్రయం.. అభిమానాన్ని క్యాష్​ చేసుకుంటున్న దళారీలు

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 10:55 PM IST

IND Vs SA Match Black Tickets
IND Vs SA Match Black Tickets

IND Vs SA Match Black Tickets : క్రికెట్ ప్రేమికుల అభిమానాన్ని క్యాష్​ చేసుకున్న ఓ వ్యక్తి.. నవంబర్ 5న జరగనున్న ఇండియా దక్షిణాఫ్రికా మ్యాచ్​ టికెట్లను దాదాపు ఆరు రెట్లు ఎక్కువకు బ్లాక్​లో విక్రయించాడు. దీనిపై సమాచారం అందుకున్న కోల్​కతా పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు.

IND Vs SA Match Black Tickets : 2023 వన్డే కప్​లో సగానికి పైగా మ్యాచ్​లు అయిపోయాయి. అయితే ఉత్కంఠ రేపే మ్యాచ్​లు వేళ్ల మీద లెక్కపెట్టడం కూడా కష్టతరంగా మారింది. కానీ సెమీస్​ రేసు ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 5న కోల్​కతా వేదికగా జరగనున్న ఇండియా- దక్షిణాఫ్రికా మ్యాచ్​పై అంచనాలు పెరిగిపోయాయి. టికెట్లు హాట్​కేకుల్లా అమ్మడవుతున్నాయి. టికెట్ల కోసం అభిమానులు ఎగబడుతండటం వల్ల బ్లాక్ మార్కెట్ దందా కూడా జోరుగా సాగుతోంది. క్రికెట్​ ప్రేమికుల అభిమానాన్ని కొందరు దళారీలు క్యాష్​ చేసుకుంటున్నారు. కోల్​కతాకు చెందిన అంకిత్​ అగర్వాల్ అనే వ్యక్తి రూ.2,500 మ్యాచ్​ టికెట్లను రూ11 వేలకు విక్రయించాడు. దీనిపై సమాచారం అందుకున్న కోల్​కతా పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు. అతడి వద్ద నుంచి 20 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.

  • Kolkata, West Bengal | A man named Ankit Agarwal was arrested for selling the ICC Cricket World Cup India Vs South Africa match tickets worth Rs. 2500 at Rs. 11,000 each. Kolkata Police seized a total of 20 tickets from his possession for the India Vs South Africa match which is… pic.twitter.com/9f4uwRYd9m

    — ANI (@ANI) October 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ఇండియా-దక్షిణాతాఫ్రిగా స్పెషల్ అదే'
IND VS SA World Cup 2023 : 2023 వన్డే ప్రపంచ కప్​లో భారత్​-దక్షిణాఫ్రిగా వరుస విజయాలతో దూసుకెళ్తున్నాయి. దీంతో పాటు నవంబర్ 5న (Virat Kohli Birthday Date 2023) టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు కావడం వల్ల.. ఈ మ్యాచ్​కు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించింది. దీంతో ఈ మ్యాచ్‌కు విపరీతమైన హైప్ ఏర్పడింది. ఈ కారణంగా ఈ మ్యాచ్​ను ఎలాగైనా చూడాలని అభిమానులు టికెట్ల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆన్‌లైన్ వేదికగా ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. ఈ క్రమంలోనే అభిమానులు ఎంత ధరైనా వెచ్చిండడానికి సిద్ధం అయ్యారు. దీన్ని బ్లాక్​ బకాసురులు క్యాష్​ చేసుకుంటున్నారు. ఒక్కో టికెట్‌ను 6 రెట్ల ఎక్కువ ధరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ వరల్డ్​ కప్​లో ఆడిన ఆరు మ్యాచ్​ల్లో భారత్ విజయం సాధించి టేబుల్ టాపర్​గా నిలిచింది టీమ్ఇండియా. అనధికారికంగా సెమీస్​కు కూడా చేరింది. గురవారం శ్రీలంకతో జరిగే మ్యాచ్​ గెలిస్తే సెమీన్​ పక్కా అవుతుంది.

Pakistan Team Kolkata Biryani : హోటల్‍లో డిన్నర్​కు పాక్​ టీమ్​ నో.. 'జామ్​ జామ్​'లో బిర్యానీ ఆర్డర్!

Virat Kohli ODI Century Record : నేను ఇన్ని సెంచరీల​ చేస్తాననుకోలేదు.. ఇలాంటివి ఎవరూ ప్లాన్​ చేయరు : కోహ్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.