ETV Bharat / sports

రెండు వికెట్లు కోల్పోయిన కివీస్.. లంచ్​ విరామానికి 197/2

author img

By

Published : Nov 27, 2021, 11:41 AM IST

Updated : Nov 27, 2021, 12:02 PM IST

nz
న్యూజిలాండ్

IND vs NZ 1st Test day 3: భారత్​- న్యూజిలాండ్ మధ్య కాన్పుర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు లంచ్​ సమయానికి కివీస్ 197 పరుగులు చేసింది కివీస్. రెండు వికెట్లు కోల్పోయింది.

IND vs NZ 1st Test day 3: న్యూజిలాండ్, భారత్​ తొలి టెస్టు మూడో రోజు మ్యాచ్​లో భాగంగా ఓపెనర్​ విల్ యంగ్​ను పెవిలియన్​కు పంపాడు టీమ్​ఇండియా స్పిన్నర్ అశ్విన్. కివీస్​ సారథి కేన్​ విలియమ్సన్​ను ఔట్​ చేశాడు ఉమేశ్​ యాదవ్. దీంతో లంచ్​ విరామానికి రెండు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది కివీస్.

రెండో రోజు మ్యాచ్​లో భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది న్యూజిలాండ్. లాథమ్, యంగ్​ అర్ధసెంచరీలతో అదరగొట్టి 129 పరుగులు చేశారు. మూడో రోజు యంగ్ 89 పరుగుల వద్ద అశ్విన్​ బౌలింగ్​లో ఔటయ్యాడు.

సాహాకు విశ్రాంతి..

మూడో రోజు మ్యాచ్​లో టీమ్​ఇండియా వికెట్​ కీపర్​గా ఆడే అవకాశం దక్కించుకున్నాడు ఆంధ్రప్రదేశ్​కు చెందిన శ్రీకర్ భరత్(KS Bharat news). మెడనొప్పి కారణంగా సాహాకు విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ పేర్కొంది. దీంతో భరత్ మైదానంలో వచ్చాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్​ఇండియా 345 పరుగులు చేసింది. టీమ్​ఇండియా బ్యాటర్ శ్రేయస్​ అయ్యర్(105), జడేజా(50) రాణించారు. కివీస్​ బౌలర్ టిమ్ సౌథీ ఐదు వికెట్లు పడగొట్టాడు.

ఇదీ చదవండి:

IND Vs NZ Test: లాథమ్, యంగ్ హాఫ్ సెంచరీలు.. రెండోరోజు కివీస్​దే!

Last Updated :Nov 27, 2021, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.