ETV Bharat / sports

2 బెర్త్​లు 4 జట్లు- ఉత్కంఠగా వరల్డ్​కప్​ సెమీస్​ రేస్​, భారత్​తో తలపడేదెవరు?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2023, 7:48 AM IST

World Cup 2023 Semi Final Teams : 2023 వన్డే ప్రపంచకప్‌లో మ్యాచ్​లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా సెమీస్​కు చేరుకోగా.. మరో రెండు బెర్త్​ల కోసం నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో భారత్​తో సెమీస్​లో తలపడే జట్టు ఏదన్నది ఆసక్తికరంగా మారింది. టీమ్ఇండియాతో సెమీ ఫైనల్​ ఆడే అవకాశాలు ఏయే టీమ్​లకు ఉన్నాయంటే?

World Cup 2023 Semi Final Teams
World Cup 2023 Semi Final Teams

World Cup 2023 Semi Final Teams : 2023 వరల్డ్​కప్​లో టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్‌ చేరుకున్నాయి. లీగ్​ స్టేజ్​లో ఆడిన 8 మ్యాచ్​ల్లో విజయం సాధించింది టేబుల్​ టాపర్​గా నిలిచింది భారత్. ఇక సెమీస్​లో మరో రెండు బెర్త్​ల కోసం నాలుగు జట్లు పోటీలో ఉన్నాయి. ఈ క్రమంలో ఈ నెల 15న జరిగే తొలి సెమీ ఫైనల్​ సమరంలో భారత్​తో ఎవరు తలపడతారన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ మెగా టోర్నీలో ఇప్పటికే ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, శ్రీలంక సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించాయి. మరోవైపు భారత్​తో పాటు దక్షిణాఫ్రికా కూడా నాకౌట్‌ దశకు చేరుకుంది. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ల మధ్య పోటీ పడుతున్నాయి. అయితే ఇందులో ఆస్ట్రేలియా జట్టు 7 మ్యాచ్‌ల్లో 5 విజయాల (10 పాయింట్లు)తో సెమీస్‌కు చేరేందుకు దగ్గర్లో ఉంది. దీనికి తోడు తన చివరి రెండు మ్యాచ్‌లను వరుసగా అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే అప్పుడు 14 పాయింట్లవుతాయి.

అయితే ఆస్ట్రేలియాతో పాటు దక్షిణాఫ్రికాకు కూడా 14 పాయింట్లు సాధించే అవకాశముంది. ఒకవేళ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సమానంగా పాయింట్లు సాధిస్తే.. నెట్‌ రన్‌రేట్‌ను బట్టి ఏ టీమ్​ 2, 3 స్థానాల్లో నిలుస్తాయో తెలుస్తుంది. ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్‌ గెలిచినా సెమీస్‌ చేరుతుంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతే.. మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

ఇక 8 మ్యాచ్‌ల్లో చెరో నాలుగు విజయాలతో ఉన్న న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ జట్లు.. తమ చివరి మ్యాచ్‌లను వరుసగా శ్రీలంక, ఇంగ్లాండ్‌లతో ఆడనున్నాయి. ఈ మ్యాచ్​ల్లో కివీస్‌, పాకిస్థాన్​ విజయం సాధిస్తే.. చెరో 10 పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ ఉన్న జట్టు (అఫ్గానిస్థాన్​ ఓడితే) ముందంజ వేస్తుంది. ఒకవేళ ఈ రెండు జట్లు ఓడిపోయి, అఫ్గానిస్థాన్​ కూడా మిగతా మ్యాచ్‌ల్లో ఓటమి పాలైతే.. అప్పుడు ఈ మూడు జట్లలో మెరుగైన నెట్‌రన్‌రేట్‌ ఉన్న టీమ్ నాకౌట్‌ దశకు చేరుతుంది. అఫ్గానిస్థాన్​.. కంగారూ జట్టు, దక్షిణాఫ్రికాలపై గెలిస్తే.. 12 పాయింట్లతో నేరుగా సెమీ ఫైనల్​కు చేరుతుంది. ఇక ఒక్క మ్యాచ్‌ గెలిచినా మెరుగైన రన్‌రేట్‌ ఉంటే న్యూజిలాండ్, పాకిస్థాన్​లను దాటేసి ముందంజ వేయొచ్చు. మరి నాలుగో స్థానంలో నిలిచి భారత్‌ను సెమీస్‌లో ఎదుర్కొనే జట్టేదో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.

బంగ్లా చేతితో శ్రీలంక చిత్తు - ఎట్టకేలకు టోర్నీలో రెండో విజయం

'పంజాబ్​'దే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ - తొలిసారి టైటిల్ కైవసం, ఫైనల్​లో బరోడా డీలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.