ETV Bharat / sports

గుజరాత్​కు ఇక సెలవు - ముంబయి గూటికి హార్దిక్ - డీల్​ ఎలా కుదిరిందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2023, 6:47 AM IST

Updated : Nov 27, 2023, 8:16 AM IST

Hardik Pandya Mumbai Indians
Hardik Pandya Mumbai Indians

Hardik Pandya Mumbai Indians : 2024 ఐపీఎల్​ ట్రేడింగ్​లో హార్దిక్ ఏ జట్టులో ఉంటాడన్నదానిపై సస్పెన్స్ వీడింది. వచ్చే ఏడాది అతడు ముంబయి జట్టుకే ఆడనున్నాడు.

Hardik Pandya Mumbai Indians : 2024 ఐపీఎల్​ వేలానికి సంబంధించి ఆయా ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న, వదులుకున్న ప్లేయర్లను ప్రకటించాయి. గుజరాత్ టైటన్స్ జట్ట తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యను.. అట్టిపెట్టుకున్నట్లు ప్రకటించింది. దీంతో అతడు ముంబయి ఇండియన్స్‌కు తిరిగి వెళ్తాడనే వార్తలకు ఫుల్​స్టాప్ పడింది.

కానీ, కొన్ని గంటల్లోనే సంచలనం జరిగింది. హార్దిక్​ గుజరాత్​ను వదిలి మళ్లీ ముంబయితో చేరనున్నట్లు సమాచారం అందింది. 2022 ఐపీఎల్​లో గుజరాత్​ను ఛాంపియన్​గా, 2023లో రన్నరప్​గా నిలిపిన కెప్టెన్ హార్దిక్.. రానున్న సీజన్​లో ముంబయి ఇండియన్స్​కు ఆడనున్నాడు. ఈ మేరకు రెండు ఫ్రాంచైజీల మధ్య ఓప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.

ట్రేడింగ్ ఇలా.. అయితే ముంబయి యాజమాన్యం.. హార్దిక్​కు వార్షిక జీతంతోపాటు, గుజరాత్​కు కూడా భారీ మొత్తం చెల్లించేందుకు ఓకే చెప్పిందట. కానీ, అది ఎంత మొత్తమో బయటకు రాలేదు. అయితే ముంబయి, గుజరాత్​కు ఎంత ఇచ్చినా.. అందులో 50 శాతం హార్దిక్​కు దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక యాధావిధిగా హార్దిక్​కు ముంబయి.. జీతం రూపంలో ఏడాదికి రూ. 15 కోట్లు చెల్లించనుంది.

గ్రీన్ పోయే హార్దిక్ వచ్చే.. ముంబయి జట్టులో మరో కీలక మార్పు జరిగింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ను బెంగళూరుకు ఇచ్చేసింది. గత వేలంలో ముంబయి గ్రీన్​ను రూ. 17.50 కోట్లకు కొనుగోలు చేసింది. హార్దిక్​ను జట్టులోకి తెచ్చుకునేందుకు ముంబయి పర్స్​లో తగినంత డబ్బు లేకపోవడం వల్ల.. గ్రీన్​ను ఆర్​సీబీకి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆర్చర్‌, మెరెడిత్‌, రిచర్డ్‌సన్‌, జోర్డాన్‌ తదితర ఆటగాళ్లను ముంబయి వదులుకుంది.

  • Mumbai Indians paying 15 cr to Gujrat Titans for Hardik Pandya.

    They are not trading with any player. So one is gone till now. pic.twitter.com/isxSvUBqqg

    — ANSHUMAN🚩 (@AvengerReturns) November 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అశ్విన్, రహానే తర్వాత.. అయితే ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటి వరకు.. రవిచంద్రన్ అశ్విన్, అంజిక్యా రహానే తర్వాత కెప్టెన్​ను కొనుగోలు చేయడం ఇది మూడోసారి. 2020లో పంజాబ్ కెప్టెన్​గా ఉన్న అశ్విన్ దిల్లి క్యాపిటల్స్​ జట్టుకు ట్రేడవగా.. అదే ఏడాది రాజస్థాన్ కెప్టెన్​గా ఉన్న రహానే.. దిల్లికే అమ్ముడయ్యాడు. కానీ, హార్దిక్ టైటిల్ విన్నింగ్ కెప్టెన్. అశ్విన్, రహానే కెప్టెన్సీలో వారి జట్లు టైటిల్ సాధించలేదు.

పాక్​లో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ​!- ఇండియా రానంటే మాకు పరిహారం చెల్లించాలి : పాకిస్థాన్

గుజరాత్​ జట్టులోనే హార్దిక్- ఐపీఎల్‌ 2024కు ముందు ఫ్రాంచైజీలు రిలీజ్​ చేసిన ప్లేయర్లు వీరే!

Last Updated :Nov 27, 2023, 8:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.