ETV Bharat / sports

'ధోనీని మెంటార్​గా నియమించడానికి కారణం అదే'

author img

By

Published : Sep 15, 2021, 12:01 PM IST

మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీని టీమ్​ఇండియా మెంటార్​గా(Team India Mentor T20 World Cup) నియమిస్తూ బీసీసీఐ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక అసలు కారణమేంటో తెలిపాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(Ganguly on Dhoni).

dhoni, ganguly
ధోనీ, గంగూలీ

టీ20 ప్రపంచకప్(T20 World Cup)​ కోసం ఎంపిక చేసిన భారత జట్టుకు మాజీ సారథి ఎంఎస్​ ధోనీని మెంటార్​గా(Dhoni Mentor) నియమించడానికి కారణం తెలిపాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(Ganguly News). 2013 తర్వాత టీమ్​ఇండియా ఐసీసీ ట్రోఫీ సొంతం చేసుకోలేదని అందుకే ధోనీకి ఆ బాధ్యతలు అప్పజెప్పినట్లు పేర్కొన్నాడు.

"ప్రపంచకప్​లో టీమ్​ఇండియాకు సాయం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. టీ20 ఫార్మాట్​లో.. భారత జట్టు తరఫున, చెన్నై సూపర్​కింగ్స్​ తరఫున ధోనీకి మంచి రికార్డులున్నాయి. బాగా ఆలోచించి, పలు మార్లు చర్చించాకే ధోనిని మెంటార్​గా నియమించాలనే నిర్ణయం తీసుకున్నాం. టీమ్​ఇండియా 2013 నుంచి ఇప్పటివరకు ఐసీసీ ట్రోఫీ గెలవలేదు."

--సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.

ఆస్ట్రేలియా జట్టుకు మాజీ సారథి స్టీవ్​ వా మెంటార్​గా వ్యవహరించడం వల్లే.. 2019 యాషెస్​ సిరీస్ ఆసీస్ సొంతమైందని గంగూలీ గుర్తుచేశాడు. ఈ నేపథ్యంలో ధోనీ మెంటార్​గా(Team India Mentor T20 World Cup) వ్యవహరించడం టీమ్​ఇండియాకు మంచిదని అభిప్రాయపడ్డాడు.

అక్టోబర్ 24న టీ20 ప్రపంచకప్​ తొలి మ్యాచ్​ పాకిస్థాన్​తో ఆడనుంది టీమ్​ఇండియా.

ఇదీ చదవండి:

రవిశాస్త్రిపై చర్యలు.. దాదా ఏమన్నాడంటే?

T20 World Cup 2021: 'సెమీస్ పోరు ఈ నాలుగు జట్ల మధ్యే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.