ETV Bharat / sports

ఆ పనితో నెటిజన్ల మనసు దోచిన కోహ్లీ

author img

By

Published : Sep 10, 2021, 5:30 AM IST

Virat Kohli picking up a bottle while Joe Root 'ignores' it goes viral
ఆ పనితో నెటిజన్ల మనసు దోచిన కోహ్లీ

ఇంగ్లాండ్​తో నాలుగో టెస్టు అనంతరం స్టేడియంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. దానికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో ఇప్పుడు వైరల్​గా మారింది. ఆ వీడియో చూసిన వారంతా.. భారత కెప్టెన్​ విరాట్​ కోహ్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇంగ్లాండ్​తో నాలుగో టెస్టులో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్​ అనంతరం మైదానంలో జరిగిన ఓ చిన్నపాటి ఘటన ఇప్పుడు వైరల్​గా మారింది. ఆ వీడియోను చూసిన వారంతా భారత కెప్టెన్​ విరాట్​ కోహ్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది.

మ్యాచ్​ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్​ కెప్టెన్​ జో రూట్​, టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ పెవిలియన్​ వైపు నడుచుకుంటూ వచ్చారు. బౌండరీ లైన్​ వద్ద మెట్ల మార్గంలో ఉన్న వాటర్​ బాటిన్​ను ముందుగా వచ్చిన రూట్​ చూసి చూడనట్లు వెళ్లిపోయాడు. కానీ, ఆ తర్వాత వచ్చిన కోహ్లీ కింద పడిన బాటిల్​ను తీసుకుని డస్ట్​బిన్​ వేసేందుకు తీసుకెళ్లాడు. ఇప్పుడా వీడియో సోషల్​మీడియాలో విపరీతంగా వైరల్​ అవుతోంది. ఇద్దరి కెప్టెన్ల మధ్య వ్యత్యాసం ఇదేనంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి.. IND Vs ENG Preview: నిర్ణయాత్మక పోరులో గెలిచేది ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.