ETV Bharat / sports

టీమ్ఇండియాకు జరిమానా.. కారణమదే!

author img

By

Published : Mar 15, 2021, 7:04 PM IST

అహ్మదాబాద్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టీ20లో స్లోఓవర్​ రేటుకు కారణమైన టీమ్ఇండియాకు ఐసీసీ జరిమానా విధించింది. ఈ మ్యాచ్​లో ఒక ఓవర్ స్లోఓవర్​ రేటు కారణంగా కోహ్లీసేన మ్యాచ్​ ఫీజులో ఐసీసీ కోత పెట్టింది.

Team India fined for slow over-rate in 2nd T20I
టీమ్ఇండియాకు జరిమానా.. కారణమదే!

ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టీ20లో స్లోఓవర్​ రేటు కారణంగా.. టీమ్ఇండియాకు 20 శాతం మ్యాచ్​ ఫీజు కోత విధించారు. ఈ మ్యాచ్​లో ఒక ఓవర్​ స్లోరేటు అవ్వడం వల్ల కోహ్లీ సారథ్యంలోని భారత జట్టుకు జరిమానా విధిస్తున్నట్లు ఐసీసీ ఇలైట్​ ప్యానెల్​ ఆఫ్​ మ్యాచ్​ రిఫరీ జవగళ్​ శ్రీనాథ్​ వెల్లడించారు.

"ఐసీసీ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్​ 2.22 ప్రకారం.. కేటాయించిన సమయంలో కనీస ఓవర్​ రేటును అందుకోవడంలో క్రికెటర్లు విఫలమైతే వారి మ్యాచ్​ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. మ్యాచ్ ఫీజులో కోతకు టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ అంగీకరించాడు. దీంతో ప్రాథమిక విచారణ అవసరం లేదు" అని ఐసీసీ సోమవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

అహ్మదాబాద్​లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో అనిల్​ చౌదరీ, కేఎన్​ అనంత పద్మనాభన్​ ఆన్​-ఫీల్డ్​ అంపైర్లుగా వ్యవహరించగా.. వీరేందర్​ శర్మ మూడో అంపైర్​గా ఉన్నారు. ఈ మ్యాచ్​లో ఇంగ్లాండ్​పై 7 వికెట్ల తేడాతో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది.

ఇదీ చూడండి: 'డబ్బు ఎక్కువ ఇచ్చారని బాల్​ స్వింగ్​ అవ్వదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.