Ind Vs Eng: టీమ్​ఇండియాలో మరొకరికి కరోనా.. ఐదో టెస్టు డౌటే

author img

By

Published : Sep 9, 2021, 4:09 PM IST

Updated : Sep 9, 2021, 4:49 PM IST

Another member of India's support staff tests positive, team cancels practice

16:06 September 09

జూనియర్​ ఫిజియో యోగేశ్​ పరమార్​కు పాజిటివ్​

టీమ్ఇండియా కోచ్​ బృందానికి కరోనా సోకిన తర్వాత మరో పాజిటివ్​ కేసు నమోదయ్యింది. ఇంగ్లాండ్​ పర్యటనలో ఉన్న టీమ్​ జూనియర్​ ఫిజియో యోగేశ్​ పరమార్​కు కరోనా సోకినట్లు బీసీసీఐ వర్గాలు గురువారం వెల్లడించాయి. దీంతో ఐదో టెస్టుకు ముందు జరగాల్సిన ప్రాక్టీస్​ ఆగిపోయింది. దీంతో ఐదో టెస్టు నిర్వహణ సందేహంగా మారింది. 

ప్రాక్టీస్​ నిలిచిపోయిన కారణంగా టీమ్ఇండియా ఆటగాళ్లందరూ తమ గదులకు చేరుకున్నారు. ఇప్పటికే ప్రధానకోచ్​ రవిశాస్త్రితో బౌలింగ్​​ కోచ్ భరత్​ అరుణ్​​, ఫీల్డింగ్​ కోచ్​ ఆర్​.శ్రీధర్​, ఫిజియో నితిన్​ పటేల్​ ఐసోలేషన్​లో ఉన్నారు. ఇంగ్లాండ్​తో జరగనున్న టెస్టు సిరీస్​లో 2-1తో టీమ్ఇండియా ఆధిక్యంలో ఉంది.  

ఇదీ చూడండి.. మెంటార్​గా ధోనీ.. గంభీర్​ సంచలన వ్యాఖ్యలు

Last Updated :Sep 9, 2021, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.