మెంటార్​గా ధోనీ.. గంభీర్​ సంచలన వ్యాఖ్యలు

author img

By

Published : Sep 9, 2021, 3:59 PM IST

Gautam Gambhir highlights reasons why BCCI roped in Dhoni as mentor for T20 World Cup 2021
టీమ్ఇండియా మెంటార్​పై గంభీర్​ సంచలన వ్యాఖ్యలు ()

టీమ్ఇండియా మాజీ కెప్టెన్​ ఎంఎస్​ ధోనీ(Dhoni Mentor)పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​. టీ20 ప్రపంచకప్​లో(ICC T20 world Cup) ధోనీని కేవలం కీలక మ్యాచ్​ల్లో ఒత్తిడిని ఎలా జయించాలో సూచనలు ఇచ్చేందుకే ఎంపిక చేసి ఉంటారని అన్నాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్​లో(ICC T20 world Cup 2021) పాల్గొనే భారత జట్టును(T20 World Cup Indian Squad) బుధవారం బీసీసీఐ సెలెక్షన్​ కమిటీ ఛైర్మన్​ అధ్యక్షుడు ఛైర్మన్​ చేతన్​ శర్మ ప్రకటించారు. ఈ టోర్నీ కోసం 15 మందితో ఎంపిక చేసిన జట్టుకు మెంటార్​గా ధోనీని(Dhoni Mentor) నియమించారు. ఇదే విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా కూడా వెల్లడించారు. అయితే ఈ మెగా ఈవెంట్​లో ధోనీని మెంటార్​గా నియమించడం వెనుక ఓ కారణం ఉందని మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​(Gambhir Dhoni) అంటున్నాడు.

"ఇందులో ధోనీ పాత్ర ఎంతో తెలియాల్సి ఉంది. ఇప్పటికే జట్టుకు ప్రధాన కోచ్​, అసిస్టెంట్​ కోచ్​, బౌలింగ్​ కోచ్​ ఉన్నారు. కాబట్టి కోచ్​ రవిశాస్త్రి, కెప్టెన్​ విరాట్​ కోహ్లీలు కాకుండా.. కొత్తగా అతడికి ఏదైనా ప్రత్యేకత ఉండాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నా. ఎందుకంటే టీ20ల్లో టీమ్ఇండియా విజయవంతంగా కొనసాగుతోంది. కానీ, కష్టాల్లో లేదు. ఒకవేళ పొట్టి ఫార్మాట్​లో భారత్​ జట్టుకు నిలకడ లేకపోతే బయట నుంచి ఎవర్ని అయినా తీసుకోవచ్చు."

- గౌతమ్​ గంభీర్​, టీమ్ఇండియా మాజీ క్రికెటర్​

కెప్టెన్​గా ధోనీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తీరును బట్టి.. అతడిని మెంటార్​గా నియమించి ఉండొచ్చని గంభీర్​ అన్నాడు. "బహుశా.. కీలక మ్యాచ్​ల్లో ఒత్తిడిని, సవాళ్లను ఎదుర్కొన్న అనుభవం కలిగిన ధోనీ.. మెంటార్​గా వ్యవహరిస్తే జట్టుకు మంచి జరుగుతుందని భావించి ఉండొచ్చు. అయితే ధోనీ ఎంపిక నైపుణ్యం పరంగా జరిగింది కాదు. ఎందుకంటే భారత జట్టులోని క్రికెటర్లందరూ నైపుణ్యం కలిగినవారే. కీలక మ్యాచ్​ల్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ధోనీ సహాయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నాకౌట్​ మ్యాచ్​ల్లో ఎలా వ్యవహరించాలో ధోనీకి తెలుసు కాబట్టి.. ఆటగాళ్లకు అది ప్రయోజనంగా మారొచ్చు" అని గంభీర్​ అభిప్రాయపడ్డాడు.

మరికొద్ది రోజుల్లో యూఏఈ వేదికగా ఐపీఎల్​(IPL 2021) రెండోదశ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో చెన్నై సూపర్​కింగ్స్​ జట్టుకు ధోనీ(CSK Dhoni) సారథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్​ ముగిసిన వెంటనే అక్కడే ఉండి.. టీ20 ప్రపంచకప్​ జట్టుతో కలవనున్నాడు.

ఇదీ చూడండి.. 'శాస్త్రి, ధోనీ మధ్య భేదాభిప్రాయాలు వస్తే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.