ETV Bharat / sports

WTC Final: 'కివీస్​తో పోరులో వాళ్లిద్దరే కీలకం'

author img

By

Published : Jun 8, 2021, 6:45 PM IST

ప్రపంచ టెస్టు​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​పై స్పందించాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్​ పార్థివ్ పటేల్. కోహ్లీ సేనకు.. బ్యాటింగ్​లో ఛెతేశ్వర్ పుజారా, బౌలింగ్​లో మహమ్మద్​ షమీ కీలకం కానున్నారని అభిప్రాయపడ్డాడు.

parthiv patel, chetheshwar pujara
పార్థివ్ పటేల్, ఛెతేశ్వర్ పుజారా

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​పై మాజీ వికెట్​కీపర్ పార్థివ్ పటేల్ స్పందించాడు. బ్యాటింగ్​లో ఛెతేశ్వర్ పుజారా, బౌలింగ్​లో మహమ్మద్ షమీ కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. కివీస్​తో జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక ఈ పోరులో అత్యధిక పరుగులు, ఎక్కువ వికెట్లు తీసే క్రికెటరెవరనేది అంచనా వేశాడు.

"తొలిసారి జరుగుతున్న డబ్ల్యూటీసీ పోరులో భారత్​ తరఫున పుజారా కీలకం కానున్నాడు. భారత్​ తొలుత బ్యాటింగ్ చేస్తే అతడు మూడో స్థానంలో క్రీజులోకి రావాలి. ఒకవేళ టీమ్ఇండియా త్వరగా వికెట్లు కోల్పోతే అతడు ఓ మూడు నాలుగు గంటలు క్రీజులో గడిపితే చాలు. కోహ్లీసేన పటిష్ఠమైన స్థితిలో ఉంటుంది. ఈ మ్యాచ్​లో పుజారానే అత్యధిక పరుగులు చేస్తాడు. ఇక బౌలింగ్​లో బుమ్రా, ఇషాంత్ ఉన్నప్పటికీ.. షమీనే కీలకం కానున్నాడు. ఇంగ్లాండ్​ పరిస్థితులకు తగ్గట్లు అతడి బౌలింగ్ తీరు ఉంటుంది."

-పార్థివ్ పటేల్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్.

కాగా, భారత మాజీ బౌలర్​ ఇర్ఫాన్​ పఠాన్​ ఈ విషయంలో వేరే విధంగా అంచనా వేశాడు. బ్యాటింగ్​లో కేన్ విలియమ్సన్​ అత్యధిక పరుగులు చేస్తాడని, బౌలింగ్​లో మాత్రం ట్రెంట్ బౌల్ట్​తో పాటు మహమ్మద్ షమీ రాణిస్తారని అభిప్రాయపడ్డాడు.

ఇదీ చదవండి: కోహ్లీ.. వన్డేల్లో ఆల్​టైమ్​ గ్రేట్​ బ్యాట్స్​మన్​.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.