ETV Bharat / sports

ధోనీ చేసిన పనికి రైనా షాక్​ - పెళ్లికి పిలిచి మరీ అలా అన్నాడట!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 8:11 PM IST

Updated : Dec 24, 2023, 6:28 AM IST

Dhoni Raina Funny Incident
Dhoni Raina Funny Incident

Dhoni Raina Funny Incident : టీమ్ఇండియా మాజీ ప్లేయర్స్​ ఎంఎస్​ ధోనీ, సురేశ్​ రైనా రిలేషన్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీమ్ఇండియాకు ఆడుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ద్వయం మైదానంలో ఎన్నో అద్భుతాలు చేశారు. అంతే కాకుండా బయట కూడా ఈ ఇద్దరూ ఎంతో క్లోజ్​గా ఉంటారు. అయితే తాజాగా రైనా తనకు ధోనీకి మధ్య జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్​ గురించి చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Dhoni Raina Funny Incident : చెన్నై సూపర్ కింగ్స్​ అంటేనే మనకు గుర్తొచ్చేది ధోనీ రైనా రిలేషన్​షిప్​. టీమ్​ఇండియాకు సేవలందించిన ఈ స్టార్ ప్లేయర్స్​ ఐపీఎల్​లోనూ తమ జట్టుకు కీలక విజయాలను అందించారు. ఈ ద్వయం బ్యాట్​ పట్టి క్రీజులోకి వచ్చిందంటే ఇక పరుగుల వరద ఖాయమంటూ యెల్లో ఆర్మీ సంబరాలు చేసుకుంటుంది. అయితే ఈ ఇద్దరూ మైదానంలోనే కాకుండా బయట కూడా మంచి స్నేహితులు.

అయితే ఈ ఇద్దరూ ఎప్పుడో రిటైర్మెంట్​ ప్రకటించారు. ఆ తర్వాత చెన్నై జట్టుకు ఆడిన రైనా ప్రస్తుతం బ్యాట్​ వదిలేసి క్రికెట్ ఎక్స్​పర్ట్​గా మారాడు. క్రికెట్​కు సంబంధించిన షోస్​, ఇంటర్వ్యుల్లో పాల్గొని సందడి చేస్తుంటాడు. అప్పుడప్పుడు ఫ్యాన్స్​తో పాటు యాంకర్లకు ధోనీకి తనకు మధ్య ఉన్న రిలేషన్​ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్తుంటాడు. అలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ధోనీకి మధ్య జరిగిన ఓ ఫన్నీ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. అందులో తనను ధోనీ పెళ్లికి ఎలా పిలిచాడో చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

"ధోనీ ఒక రోజు నాకు సడెన్​గా కాల్ చేశాడు. ఎక్కడున్నావని అడిగాడు. నేను వెంటనే లఖ్​నవూలో ఉన్నానని చెప్పాను. దానికి అతడు నాకు డెహ్రాదున్​లో పెళ్లి జరుగుతోంద. నువ్వు ఇక్కడికి రా. ఈ విషయాన్ని ఇంకెవరికీ చెప్పకు. నేను నీ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అంటూ చెప్పాడు. దీంతో నేను మాములు డ్రెస్​లోనే అక్కడికి వెళ్లాను. ఆ తర్వాత ధోనీ డ్రెస్​ వేసుకుని పెళ్లికి హాజరయ్యా" అని రైనా అప్పటి ఘటనను గుర్తుచేసుకుని నవ్వుకున్నాడు. దీన్ని చూసిన ఫ్యాన్స్ కూడా నవ్వుకుంటున్నారు. ఈ ఇద్దరి రిలేషన్​షిప్​ ఎంతో స్ట్రాంగ్​ అంటూ కొనియాడుతున్నారు.

మరోవైపు ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్​లో ఆడుతున్నారు. ఇక 2024 ఐపీఎల్​ సీజనే ధోనీకి చివరిదని అంతా భావిస్తున్నారు. అయితే ఈ తర్వాత ఆయన ఏమి చేస్తారనే ఆసక్తి మొదలైంది. ఈ విషయంపై తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

'ఇప్పటివరకు ఆ విషయం (ఐపీఎల్ రిటైర్మెంట్) గురించి ఆలోచించలేదు. ఎందుకంటే ఇంకా నేను క్రికెట్ ఆడుతున్నా. ఐపీఎల్​లో సీఎస్​కే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. క్రికెట్ తర్వాత ఏం చేస్తాననేది ఆలోచిస్తుంటే నాకూ ఆస్తికరంగానే ఉంది. అయితే, ఆర్మీలో మరింత సమయం గడపాలని ఉంది. గత కొన్నేళ్లుగా నేను ఎక్కువ సమయం వెచ్చిచలేదు. ఆ లోటును పూరించాల్సిన బాధ్యత నాపై ఉంది' అని ధోని సమాధానం ఇచ్చారు

ఫ్రెండ్ బర్త్​డే వేడుకల్లో ధోనీ హంగామా - అలా చేయడం వల్ల ఫ్యాన్​ సస్పెండ్!

ధోనీ పరువు నష్టం కేసు- IPS అధికారికి 15 రోజులు జైలు శిక్ష

Last Updated :Dec 24, 2023, 6:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.