ETV Bharat / sports

కేజీయఫ్ స్టైల్​లో ధోనీ ఎంట్రీ.. చెపాక్ స్టేడియం దద్దరిల్లిందిగా!

author img

By

Published : Mar 28, 2023, 3:50 PM IST

Dhoni
కేజీయఫ్ స్టైల్​లో ధోనీ ఎంట్రీ.. చెపాక్ స్టేడియం దద్దరిల్లిందిగా!

ఐపీఎల్‌ 2023 16వ సీజన్‌ సందడి మొదలైంది. అయితే తాజాగా చెపాక్‌ స్టేడియంలో చెన్నై కింగ్​ ధోనీ ప్రాక్టీస్ చేస్తుండగా.. అభిమానులు 'ధోనీ నామస్మరణ'తో మారుమోగించారు.

ఐపీఎల్‌ 2023 16వ సీజన్‌ సందడి మొదలైంది. ఈ నెల 31న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌-గుజరాత్ టైటాన్స్‌ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని జట్లు మైదానంలో తమ సత్తా చూపించడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆటగాళ్లంతా తమ క్యాంపులకు చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించేశారు. అయితే ముఖ్యంగా ఈ మెగాటోర్నీలో క్రికెట్ ఫ్యాన్స్ అందరీ దృష్టి చెన్నై సూపర్​ కింగ్స్​ కెప్టెన్​ ధోనీపైనే ఉంది. మహీకి ఇదే చివ‌రి ఐపీఎల్‌ సీజ‌న్ అంటూ​ ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ట్రోఫీని ముద్దాడి అత‌డికి ఘ‌నంగా వీడ్కోలు ప‌ల‌కాల‌ని సీఎస్కే ప్లానింగ్‌లో ఉన్న‌ట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఎమ్​ ఎస్​​ ధోనీ ప్రాక్టీస్​ చేయడం ప్రారంభించేశాడు.

ఈ క్రమంలోనే ప్రాక్టీస్ సెష‌న్స్​ను చూసేందుకు అభిమానుల‌కు అనుమ‌తించారు నిర్వాహకులు. అయితే తాజాగా చెపాక్​ స్టేడియంలో మహీ ప్రాక్టీస్​ చేస్తుండగా.. అతడి నామస్మరణంతో మైదానం మారుమోగిపోయింది. ధోనీ స్టేడియంలో అడుగుపెట్టగానే.. అభిమానుల కేరింత‌లు, ఈలలు, అరుపులతో స్టేడియం మొత్తం ద‌ద్ద‌రిల్లిపోయింది.

నిజంగా మ్యాచ్ జరుగుతుందా అన్నంతగా.. 'ధోని ధోని' అని అరూస్తూ వేలాది మంది ప్రేక్షకులు హంగామా చేశారు. ఈ వీడియోను ఐపీఎల్ సీఎస్​కే.. తమ అధికారిక సోషల్​ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. దానికి 'హీరో మళ్లీ వస్తాడు' అని క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ వీడియోను నెట్టింట్లో తెగ షేర్​ చేస్తున్నారు మహీ అభిమానులు. ఈ వీడియోలో మహీ.. గ్లోవ్స్ ధ‌రిస్తూ బ్యాట్ ప‌ట్టుకుని స్టైలిష్‌గా మైదానంలోకి ఎంట్రీ ఇస్తూ కనిపించాడు. ఇది చూసిన ఓ అభిమాని కేజీయఫ్​ స్టైల్‌లో మహీ ఎంట్రీ అదిరిపోయిందిగా అంటూ కామెంట్​ చేశాడు. ఈ ఐపీఎల్‌కు ధోనీ బ్రాండ్ అంబాసిడ‌ర్, అత‌డికి ఉన్న క్రేజ్ ఇతర ఏ ఆటగాడికి లేదంటూ మ‌రొక అభిమాని పేర్కొన్నాడు.

కాగా,​ధోనీ భారతీయ క్రికెట్​లో అత్యంత ఆదరణ పొందిన ఆటగాళ్లలో మొదటి వరసలో ఉంటాడు. ప్రస్తుతం ​ చైన్నై సూపర్​ కింగ్స్​ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు. 2008లో ఈ ఐపీఎల్​ మొదలైనప్పటి నుంచి చెన్నైకి సారథ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు ఆ జట్టుకు నాలుగు టైటిళ్లు అందించాడు. ముంబయి తర్వాత అత్యధిక ఐపీఎల్​ టైటిళ్లు సాధించిన జట్టుగా చెన్నై నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇటీవల ధోనీకి సంబంధించిన మరో వీడియో కూడా నెట్టింట్లో వైరల్​ అయింది. మ్యాచ్​లకు చెపాక్​ స్డేడియం సిద్ధం చేస్తున్నారు. పాడైన సీట్ల స్థానంలో ప్లేస్​లో కొత్త సీట్లను అమర్చడం, రంగులు వేడయం చేస్తున్నారు. అయితే అదే మైదానంలో ప్రాక్టీస్​ చేస్తున్న ధోనీ కూడా పెయింటర్​ అవతారమెత్తి.. గ్యాస్​ బ్లోయర్​తో కూర్చీలకు పెయింట్​ వేశాడు. ఈ వీడియోను సీఎస్​కే తన ట్విట్టర్​ ఖాతాలో పోస్టు చేసింది. బ్యాటుతో ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడే ధోనీ.. ఇలా సింపుల్​గా ఉంటూ కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు.

ఇదీ చూడండి: IPL 2023 : ఐపీఎల్​ లో అదరగొట్టిన భువనేశ్వర్​.. అత్యధిక డాట్​ బాల్స్​ వేసి రికార్డ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.