ETV Bharat / sports

పాక్​-జింబాబ్వే వన్డే..  ఆ గణాంకాలు నమోదైన తొలి మ్యాచ్

author img

By

Published : Nov 4, 2020, 9:56 AM IST

zimbabwe won against pakisthan in odi 3rd match
పాక్​ పరాజయం.. జింబాబ్వే 'సూపర్‌' విజయం

మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్​స్వీప్​ చేయాలనుకున్న పాకిస్థాన్​ ఆశలు చెల్లాచెదురయ్యాయి. మంగళవారం జరిగిన ఆఖరి వన్డేలో జింబాబ్వే సూపర్​ ఓవర్లో విజయం సాధించింది.

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని ఆశించిన పాకిస్థాన్‌కు ఆఖరి వన్డేలో చుక్కెదురైంది. మంగళవారం జరిగిన చివరి మ్యాచ్​లో సూపర్‌ ఓవర్లో నెగ్గింది జింబాబ్వే. తొలుత జింబాబ్వే 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. సీన్‌ విలియమ్స్‌ (118) సెంచరీ చేశాడు. హస్నైన్‌ (5/26) సత్తా చాటాడు. ఛేదనలో ముజరంబాని (5/49) దెబ్బకు పాక్‌ 88 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా.. ఆ జట్టు బ్యాట్స్​మెన్​లో కెప్టెన్‌ అజామ్‌ (125), రియాజ్‌ (52) రాణించడం వల్ల పాక్‌ 46 ఓవర్లలో 247/6తో విజయానికి చేరువైంది.

కానీ, చివర్లో పాక్ తడబడటం వల్ల స్కోర్లు సమమయ్యాయి. సూపర్‌ ఓవర్లో పాక్‌ 2 వికెట్లు కోల్పోయి 2 పరుగులే చేసింది. జింబాబ్వే వికెట్‌ కోల్పోకుండా మూడు బంతుల్లో లక్ష్యాన్ని పూర్తిచేసింది. ఒక మ్యాచ్‌లో రెండు సెంచరీలు, రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదైన తొలి వన్డే ఇదే.

ఇదీ చూడండి:టీవీలోనూ క్రికెట్​ చూడని అమ్మాయి.. మినీ ఐపీఎల్​లో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.