ప్రపంచకప్ తర్వాత జట్టుకు దూరంగా ఉన్నాడు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ. రిటైర్మెంట్ ఊహాగానాలు వస్తోన్న నేపథ్యంలో ఇప్పటివరకు ఒక్క మాట మాట్లాడలేదీ ఆటగాడు. పలువురు మాజీలు ఇప్పటికే ధోనీ రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ ఈ విషయంపై స్పందించాడు.
"ధోనీ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తున్నాడో అతడు మాత్రమే చెప్పాలి. ప్రస్తుతం ధోనీకి 38 ఏళ్లు. టీ20 ప్రపంచకప్ సమయానికి 39 సంవత్సరాలు వస్తాయి. టీమిండియా ఈ విషయం గురించి ఆలోచించాలి."
-సునీల్ గావస్కర్, టీమిండియా మాజీ ఆటగాడు
టీమిండియాకు ధోనీ అందించిన సేవలు అద్భుతమైనవని ప్రశంసించాడు గావస్కర్. కెప్టెన్గా జట్టుకు ఎన్నో విజయాలనందించాడని తెలిపాడు.
"ధోనీ పరుగులు సాధించడమే కాకుండా.. వికెట్ల వెనుక మెరుపు స్టంపింగ్స్తో జట్టుకు ఎన్నో విజయాలనందించాడు. ధోనీకి ఉన్న మిలియన్ల అభిమానుల్లో నేనూ ఒకడిని. కానీ సమయం ఆసన్నమైంది. ఎవరూ వెళ్లమని చెప్పక ముందే అతడే వీడ్కోలు పలికితే బాగుంటుంది."
-సునీల్ గావస్కర్, టీమిండియా మాజీ ఆటగాడు
ప్రపంచకప్ తర్వాత వెస్టిండీస్, దక్షిణాఫ్రికా పర్యటనలకు దూరంగా ఉన్న ధోనీ రిటైర్మెంట్పై రోజు రోజుకూ ఊహాగానాలు ఎక్కువవుతున్నాయి. ఈ రెండు సిరీస్లకు ధోనీ స్థానంలో జట్టులోకి వచ్చిన పంత్ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు.
ఇవీ చూడండి.. అకిల ధనంజయ బౌలింగ్పై ఏడాది వేటు