ETV Bharat / sports

'భారత్​తో సిరీస్​ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా'

author img

By

Published : Jun 21, 2020, 8:58 AM IST

steve smith, a cricket batsman, said he was keen for a Test series with India in Australia.
'భారత్​తో సిరీస్​ ప్రత్యేకమైనది'

ఆస్ట్రేలియాలో భారత్​తో జరిగే టెస్టు సిరీస్​ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఆసీస్​ బ్యాట్స్​మన్​ స్టీవ్​​ స్మిత్​ అన్నాడు. భారత్​ మెరుగైన జట్టు అని అన్నాడు. మరోవైపు టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లిపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు స్మిత్​.

స్వదేశంలో భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌ ఎంతో ప్రత్యేకమైందని ఆస్ట్రేలియా క్రికెటర్​ స్టీవ్​ స్మిత్​ తెలిపాడు. ఈ ఏడాది చివర్లో టీమ్​ఇండియాతో ఆడే టెస్టు సిరీస్​ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నాడు. భారత్​ మెరుగైన జట్టు అని అన్నారు స్మిత్​.

టీమ్​ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గురించి మాట్లాడుతూ.. "మైదానం వెలుపల విరాట్‌తో మాట్లాడుతుంటా. ఈ మధ్య భారత్‌లో కరోనా పరిస్థితుల గురించి తెలుసుకున్నా. అతనో అద్భుతమైన వ్యక్తి. జట్టును గొప్పగా నడిపిస్తున్నాడు. నాలాగే మైదానంలో బాగా కష్టపడతాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో తనను, వార్నర్‌ను గేలి చేయొద్దని భారత అభిమానులను విరాట్‌ కోరడం మనసును హత్తుకుంది" అని స్మిత్‌ చెప్పాడు.

ఆస్ట్రేలియాలో భారత టెస్టు సిరీస్‌ డిసెంబరు 3న ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి:టీమ్​ఇండియాలో స్మిత్​కు ఇష్టమైన క్రికెటర్?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.