వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ నుంచి సురేశ్ రైనా తప్పుకున్నట్లు ఇటీవలే చెన్నై సూపర్కింగ్స్ వెల్లడించింది. తద్వారా కెప్టెన్ ధోనీ, మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగేందుకు మార్గం సుగమమైందని టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. మహీ సంవత్సర కాలంగా ఆటకు దూరంగా ఉన్నాడని, కాబట్టి మూడులో ఆడితే ఎక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం లభిస్తుందని అన్నాడు.
"మ్యాచ్ను ముగించే ఆటగాళ్లు ఉన్నారు కాబట్టి ధోనీ ఫస్ట్ డౌన్లోనే వస్తే బాగుంటుంది. కేదార్ జాదవ్, డ్వేన్ బ్రావో, సామ్ కరన్ లాంటి ఆటగాళ్లు మరింత మెరుగవుతారు. మహీకి ఇదో మంచి అవకాశం, దీనిని అతడు ఆస్వాదిస్తాడని భావిస్తున్నాను."
-గంభీర్, టీమ్ఇండియా మాజీ ఓపెనర్
దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు బయోసెక్యూర్ వాతావరణంలో ఐపీఎల్ 13వ సీజన్ జరగనుంది.
ఇది చూడండి ఆర్సీబీలో కెప్టెన్ కోహ్లీ స్థానానికి గండి?