ETV Bharat / sports

'కరోనాకు ఇగో ఎక్కువ.. బయటికెళ్లావో అంతే'

author img

By

Published : Mar 27, 2020, 5:21 AM IST

కరోనా మహమ్మారికి ఇగో ఎక్కువని, అందుకే బయటకు వెళ్లి దానిని పిలిచే సాహసం చేయొద్దని చమత్కరించాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరంద్ర సెహ్వాగ్. ప్రస్తుతం ఈ వైరస్​ ప్రభావంతో భారత్​ లాక్​డౌన్​లో ఉంది.

virender sehwag
'కరోనాకు ఇగో ఎక్కువ.. బయటికెళ్లావో అంతే'

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్​, సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటాడు. పరిస్థితులకు తగ్గట్లు పోస్ట్​లు పెడుతూ, కామెంట్లు చేస్తూ నెటిజన్లను అలరిస్తుంటాడు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనా విషయంలోనూ అలాంటిదే రాసుకొచ్చాడు. ఈ వైరస్​కు​ ఇగో ఎక్కువని, తనంతట తాను మన ఇంటిలోని ప్రవేశించదని చమత్కరించాడు. అయితే ప్రజలు అత్యవసర సమయాల్లో తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరాడు. తద్వారా వైరస్​ను ఆహ్వానించే అవకాశం ఇవ్వకూడదని పేర్కొన్నాడు.

ప్రజలందరూ లాక్​డౌన్ పరిస్థితులు ఉన్నన్ని రోజులు ఇంట్లో ఉంటే వైరస్​ను తరిమికొట్టొచ్చని సెహ్వాగ్ అన్నాడు. బయటకు రావాలనే ఆలోచన మానుకోవాలని సూచించాడు.

ప్రస్తుతం ఈ వైరస్​ ప్రభావం వల్ల ఐపీఎల్ వాయిదా పడింది. ఈనెల 29న ప్రారంభం కావాల్సిన టోర్నీ.. ఏప్రిల్ 15కు వెళ్లింది. అయితే అప్పుడూ మొదలవుతుందా? లేదా? అనేది సందేహంగానే ఉంది. ఈ విషయమై త్వరలో స్పష్టత రానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.