ETV Bharat / sports

'2023 ప్రపంచ కప్​లో ఆడటమే నా లక్ష్యం'

author img

By

Published : Dec 27, 2020, 5:34 PM IST

Sreesanth sharma aims to represent india in the 2023 world cup
'2023 ప్రపంచ కప్​ కోసం ఆడటమే నా లక్ష్యం'

2023 ప్రపంచ కప్​లో​ టీమ్ఇండియా తరఫున ఆడాలన్న తన కోరికను బయటపెట్టాడు టీమ్ఇండియా సీనియర్​ పేసర్ శ్రీశాంత్​. తన లక్ష్యానికి వయసు అడ్డు కాదని చెప్పాడు.

సయ్యద్ ముస్తక్​ అలీ ట్రోఫీతో మళ్లీ క్రికెట్​ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు టీమ్ఇండియా సీనియర్ పేసర్ శ్రీశాంత్​. అయితే.. తన లక్ష్యం దేశవాళీ టోర్నీ మాత్రమే కాదని ​2023 ప్రపంచ కప్​ కోసం టీమ్​ఇండియా తరఫున ఆడి, టైటిల్​ నెగ్గడమే తన అసలైన లక్ష్యమని చెప్పాడు. 37 ఏళ్ల వయసు ఉన్న తనకు లియాండర్ పేస్​, రోజర్​ ఫెదరర్​ స్ఫూర్తి అని తెలిపాడు.

"ఈ వయసులో క్రీడల్లో సాధించేది ఏదీ ఉండదు అనేది నిజమే. కానీ, లియాండర్ పేస్ 42 ఏళ్లపుడు గ్రాండ్​ స్లామ్​ టైటిల్​ సాధించాడు. రోజర్​ ఫెదరర్​ ఎంతలా దూసుకువెళ్తున్నది అందరికీ తెలిసిందే. ఒక ఫాస్ట్​ బౌలర్​గా ఇప్పుడు నేను చరిత్ర సృష్టించబోతున్నా. కేవలం దేశవాళీ టోర్నీల్లో ఆడడమే లక్ష్యంగా భావించడం లేదు. రాబోయే మూడేళ్ల కోసం నేను ఎదురు చూస్తున్నా. 2023 ప్రపంచ కప్​లో టీమ్​ఇండియా తరఫున ఆడి, టైటిల్ నెగ్గాలన్నది నా లక్ష్యం."

-శ్రీశాంత్​, భారత సీనియర్ పేసర్​

2013 ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ చేశాడని శ్రీశాంత్‌పై బీసీసీఐ నిషేధం విధించింది. ఈ సెప్టెంబర్​లో అతడిపై నిషేధం తొలగిపోయింది. దాంతో దాదాపుగా ఏడేళ్ల తర్వాత అతడు సయ్యద్​​ ముస్తక్​ అలీ ట్రోఫీలో.. కేరళ తరఫున పోటీ క్రికెట్‌ ఆడుతుండటం గమనార్హం.

ఇదీ చూడండి:దేశవాళీ టోర్నీలో సచిన్ తనయుడికి నో ఛాన్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.