ETV Bharat / sports

టీమ్​ఇండియా మహిళా జట్టుపై కైఫ్​ ఆసక్తికర వ్యాఖ్యలు

author img

By

Published : Jul 20, 2020, 2:41 PM IST

Updated : Jul 20, 2020, 4:38 PM IST

Rise of Indian women's cricket in past three years has been phenomenal: Mohammad Kaif
'టీమ్​ఇండియా మహిళా జట్టు ప్రదర్శన ఆసాధారణం'

గత మూడేళ్లలో టీమ్​ఇండియా మహిళా జట్టు అసాధారణ రీతిలో ప్రదర్శన కనబరుస్తోందని భారత మాజీ బ్యాట్స్​మన్​ మహ్మద్​ కైఫ్​ తెలిపాడు. తాజాగా హర్మన్ ప్రీత్ ఇన్నింగ్స్​ను గుర్తు చేసుకుంటూ ఓ పోస్ట్ పెట్టాడు.

భారత మహిళా క్రికెట్​ గత మూడేళ్లలో అసాధారణమైన ప్రదర్శన కనబరుస్తోందని భారత మాజీ బ్యాట్స్​మన్​ మహమ్మద్​ కైఫ్​ అన్నాడు. 2017లో జరిగిన 50 ఓవర్ల మహిళల ప్రపంచ కప్​ సెమీ ఫైనల్​లో హర్మన్​ప్రీత్​ కౌర్​ 171 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్​ను దృష్టిలో పెట్టుకునే కైఫ్​ పై వ్యాఖ్యలు చేశాడు.

మూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్​ సెమీపైనల్ ​మ్యాచ్​లో కౌర్​ కేవలం 115 బంతుల్లో 171 పరుగులు సాధించి.. జట్టు ఫైనల్​కు చేరుకునేలా మార్గనిర్దేశం చేసింది.

  • Three years back, on this day, Harmanpreet Kaur hit 171*(115) v Australia in World Cup semi-final. Quality innings under pressure. The rise of Indian women’s cricket in the past three years has been phenomenal @ImHarmanpreet pic.twitter.com/6fy8IqvLNX

    — Mohammad Kaif (@MohammadKaif) July 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ మ్యాచ్​లో హర్మన్​ ప్రీత్​ 20 ఫోర్లు, ఏడు సిక్సర్లతో విరుచుపడింది. దీంతో భారత్​ 281 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్​ దిగిన ఆస్ట్రేలియా జట్టును 245 పరుగులకే కట్టడి చేసి టీమ్​ఇండియా మహిళా జట్టు ఫైనల్​కు చేరుకుంది . అయితే లార్డ్స్​ మైదానంలో జరిగిన ఫైనల్​లో మిథాలీ రాజ్​ సారథ్యంలోని జట్టు ప్రత్యర్థి ఇంగ్లాండ్​పై ఓటమి చవిచూసింది.

Last Updated :Jul 20, 2020, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.