ETV Bharat / sports

ప్రపంచకప్​లో 'పక్కా లోకల్' పాట, జై బాలయ్య నినాదాలు

author img

By

Published : Mar 11, 2020, 12:26 PM IST

ప్రపంచకప్​లో 'పక్కా లోకల్' పాట, జై బాలయ్య నినాదాలు
మెల్​బోర్న్ క్రికెట్ మైదానం

మహిళా ప్రపంచకప్​ ఫైనల్లో తెలుగు పాటను ప్లే చేయడం సహా 'జై బాలయ్య' అంటూ నినాదాలు చేశారు కొందరు అభిమానులు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

స్వదేశంలో ఆదివారం జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్​ ఫైనల్​లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ప్రత్యర్థి టీమిండియాను 85 పరుగుల తేడాతో ఓడించి, కప్పు ఎగరేసుకుపోయింది. అయితే మ్యాచ్​ జరుగుతున్న సమయంలో స్టేడియంలో ఓ తెలుగు పాట ప్లే కావడం హాట్​ టాపిక్​గా మారింది.

మెల్​బోర్న్​ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్​ను​ చూసేందుకు 86,174 మంది వీక్షకులు హాజరయ్యారు. ఇందులో ఎక్కువ శాతం భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే 'జనతా గ్యారేజ్'​లోని పక్కా లోకల్ పాట వేయడం వల్ల అభిమానులు డ్యాన్స్​లు వేశారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది.

ఇది చదవండి: నేటి నుంచి థియేటర్లు బంద్.. కరోనానే కారణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.