ETV Bharat / sports

సిడ్నీ టెస్టులో సంబరాలు బంద్

author img

By

Published : Dec 30, 2020, 3:31 PM IST

భారత్-ఆసీస్​ మూడో టెస్టు సిడ్నీలోనే నిర్వహిస్తామని అయితే స్టాండ్స్​లో ప్రేక్షకులు సంబరాలు చేసుకోవద్దని ఆ రాష్ట్ర ఆరోగ్య అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్​ ధరించి, కొవిడ్​ నిబంధలను పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

No cheering! India vs Australia Sydney Test gets strange request from health authorities
సిడ్నీలో కరోనా కేసులు.. మూడో టెస్టులో సంబరాలు బంద్​

ఆస్ట్రేలియా, టీమ్ఇండియా మూడో టెస్టును సిడ్నీలోనే నిర్వహిస్తామని క్రికెట్​ ఆస్ట్రేలియా ప్రకటించింది. అయితే సిడ్నీ పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మ్యాచ్​కు వచ్చే ప్రేక్షకులు, స్టాండ్స్​లో తగిన జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు. ఆ రాష్ట్ర ఆరోగ్య అధికారుల సూచన మేరకు ఈ మ్యాచ్​కు 50 శాతం మంది ప్రేక్షకులనే అనుమతించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించిదట.

"సిడ్నీ మైదానంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరికి మేం మాస్క్​లు అందజేసి.. సీటులో ఉన్నప్పుడు తప్ప మిగిలిన సమయంలో మాస్క్​ ధరించమని సూచిస్తాం. మ్యాచ్​ మధ్యలో ప్రేక్షకులంతా కలిసి సంబరాలు చేసుకోవద్దని చెబుతాం" అని న్యూ సౌత్​వేల్స్​ ఆరోగ్య అధికారి కేరీ చంట్ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో​ వెల్లడించారు.

వారం రోజులుగా సిడ్నీ పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో మూడో టెస్టు నిర్వహణపై సందేహాలు వచ్చాయి. అయితే ఆ మ్యాచ్​ను అక్కడే నిర్వహిస్తామని క్రికెట్​ ఆస్ట్రేలియా ప్రకటించింది. దీంతో పాటే స్టేడియానికి వచ్చే ప్రతి ఒక్కరూ కొవిడ్​ నిబంధనలు పాటించేలా జాగ్రత్త తీసుకుంటామని తెలిపింది. వన్డే సిరీస్​లానే ఈ మ్యాచ్​కు 50 శాతం మందిని మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: సిడ్నీలోనే మూడో టెస్టు..ఆసీస్ బోర్డు ట్వీట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.