ETV Bharat / sports

వైరల్: ట్రాక్టర్​తో పొలం దున్నుతున్న ధోనీ

author img

By

Published : Jun 28, 2020, 9:09 PM IST

లాక్​డౌన్​ సమయంలో టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ అభిరుచులపై దృష్టి కేంద్రీకరిస్తున్నాడు. తన ఫామ్​హౌస్​లో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ కనిపించాడు. తాజాగా ఇతడు ట్రాక్టర్​ ఎక్కి పొలం దున్నుతున్న వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది.

MS Dhoni returns to organic farming, sows seeds at Ranchi farmhouse
ట్రాక్టర్​ ఎక్కి పొలం దున్నుతున్న మహీ

లాక్​డౌన్​తో క్రికెట్​ కార్యకలాపాలన్నీ వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే భారత మాజీ కెప్టెన్​ ఎంఎస్ ధోనీ రాంచీలోని తన ఫామ్​హౌస్​లో కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. ఇతర ఆటగాళ్లు సోషల్​ మీడియాలో ఎప్పటికప్పుడు హుషారుగా ఉంటుంటే.. ధోనీ మాత్రం వాటికి దూరంగా ఉంటున్నాడు. ధోనీ భార్య సాక్షి, అభిమానుల ఖాతా నుంచి మాత్రమే అతనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి.

తాజాగా ధోనీ ట్రాక్టర్​తో పొలాన్ని దున్నుతున్న వీడియోను అభిమానులు ట్విట్టర్​ ద్వారా పోస్ట్​ చేశారు. ఇందులో మహీ సేంద్రీయ వ్యవసాయాన్ని నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ధోనీ తన ఫేస్​బుక్​ ఖాతాలో వీడియో పోస్ట్​ చేస్తూ.. పుచ్చకాయ, బొప్పాయి పండ్లను సేంద్రీయ పద్దతిలో ఎలా పండించాలో వెల్లడించాడు. ప్రస్తుతం లాక్​డౌన్​తో తీరిక సమయం దొరకడం వల్ల.. మహీ తన అభిరుచులవైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది.

2019 ప్రపంచకప్​ సెమీ ఫైనల్​లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం చెందింది భారత్. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్​కు ఎంఎస్​ ధోనీ దూరంగా ఉంటున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్​ టోర్నీలో తిరిగి మైదానంలో అడుగు పెట్టాల్సి ఉండగా.. కరోనా సంక్షోభం కారణంగా ఈ లీగ్​ నిరవధిక వాయిదా పడింది.

ఇదీ చూడండి:రామ్​గోపాల్ వర్మ కొత్త చిత్రం 'పవర్ స్టార్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.