బంగ్లాదేశ్పై రెండో టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. ఓపెనర్ రోహిత్(85)కు చక్కటి సహకారమందించాడు శిఖర్ ధావన్. ఈ మ్యాచ్లో వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిందీ జోడీ. అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన వారిగానూ నిలిచారు. మొత్తంగా 51 మ్యాచ్ల్లో 1740 రన్స్ చేశారు.
మ్యాచ్ అనంతరం ధావన్ ఇన్స్టాలో ఒక వీడియో పోస్టు చేయగా, బౌలర్ భువనేశ్వర్ కుమార్ ట్రోల్ చేశాడు.
ఇందులో అక్షయ్కుమార్ 'హౌస్ఫుల్-4'లోని ఓ సన్నివేశాన్ని ఖలీల్, చాహల్తో కలిసి ధావన్ అనుకరించాడు. చాహల్ శబ్దం చేసిన ప్రతిసారీ మతిమరుపు వ్యక్తిలా శిఖర్ నటించాడు. ఈ వీడియోను 'బాలా కే సైడ్ ఎఫెక్ట్స్' అని పేర్కొంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడీ క్రికెటర్.
దీనిపై స్పందించిన భువనేశ్వర్.. "మర్చిపోయినట్టు నటించడం ఎందుకు. అది సహజ నైపుణ్యమే" కదా అని సరదాగా కామెంట్ చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ప్రస్తుతం బంగ్లాదేశ్తో జరుగుతున్న టీ20 సిరీస్ను 1-1తో టీమిండియా సమం చేసుకుంది. నాగ్పుర్ వేదికగా నిర్ణయాత్మక మూడో టీ20 ఆదివారం జరగనుంది.