ETV Bharat / sports

సిడ్నీ టెస్టు: శుభ్​మన్​ గిల్​ అర్ధశతకం.. భారత్​ 96/2

author img

By

Published : Jan 8, 2021, 1:09 PM IST

India vs Australia Sydney test: India trail by 242 runs
సిడ్నీ టెస్టు: రెండో ఆట ముగిసే సమయానికి భారత్​ 96/2

ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న మూడో టెస్టులో టీమ్ఇండియా నిలకడగా ఆడుతోంది. ప్రత్యర్థిపై ఆధిక్యాన్ని తెచ్చుకునే విధంగా భారత బ్యాట్స్​మెన్​ ప్రదర్శన చేశారు. యువ బ్యాట్స్​మన్​ శుభ్​మన్​ గిల్​ హాఫ్​ సెంచరీతో అలరించగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయిన టీమ్ఇండియా 96 పరుగులు చేసింది.

సిడ్నీ వేదికగా జరుగుతోన్న మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయిన టీమ్ఇండియా.. 96 పరుగులు చేసింది. ఓపెనర్​ శుభ్​మన్​ గిల్​ (50) అర్ధశతకంతో అలరించగా.. 26 పరుగులకే రోహిత్​శర్మ వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్​లో ఛెతేశ్వర్​ పుజారా (9), కెప్టెన్​ అజింక్య రహానె (5) ఉన్నారు. భారత జట్టుపై ఆస్ట్రేలియా మరో 242 రన్స్​ ఆధిక్యంలో ఉంది.

అంతకుముందు ఆస్ట్రేలియా 338 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌స్మిత్‌ (131) టెస్టుల్లో 27వ శతకం సాధించాడు. శుక్రవారం 166/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 172 పరుగులు చేసి మిగతా 8 వికెట్లు కోల్పోయింది. స్మిత్‌, లబుషేన్‌(91) బాధ్యతాయుతంగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఆపై మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమవడం వల్ల ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు కుప్పకూలిపోయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.